తెలంగాణలో కరోనా (coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron) విస్తరిస్తోంది. తాజాగా రాష్ట్రంలో 5 కేసులు వెలుగుచూశాయి. వీటితో కలిపి తెలంగాణలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 67కి చేరుకుంది. తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 143 మంది శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు.

తెలంగాణలో కరోనా (coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron) విస్తరిస్తోంది. తాజాగా రాష్ట్రంలో 5 కేసులు వెలుగుచూశాయి. వీటితో కలిపి తెలంగాణలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 67కి చేరుకుంది. తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 143 మంది శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కొవిడ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా నలుగురు ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో వారి నమూనాలను అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 12,410 మంది తెలంగాణకు వచ్చారు.

మరోవైపు దేశంలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే తాజా కేసుల సంఖ్య 43 శాతం పెరిగింది. అటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. దేశంలో 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించగా.. గురువారం ఉదయం నాటికి 961 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. ఒమిక్రాన్ బారిన పడ్డ వారిలో 320 మంది కోలుకున్నారని వెల్లడించింది. ఒమిక్రాన్ కేసుల విషయానికి వస్తే.. ఢిల్లీలో అత్యధికంగా 263 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 257, గుజరాత్‌లో 97, రాజస్తాన్‌లో 69, కేరళలో 65 కేసులు నమోదయ్యాయి. 

ALso Read:భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. నిన్నటి కంటే 43 శాతం అధికం.. 961కి చేరిన ఒమిక్రాన్ కేసులు..

ఇక, దేశంలో గడిచిన 24 గంటల్లో 13,154 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇది క్రితం రోజు నమోదైన 9,195 కేసులతో పోలిస్తే.. 43 శాతం ఎక్కువ. ఇక, తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,48,22,040కి పెరిగింది. తాజాగా కరోనాతో 268 మృతిచెందగా.. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,80,860కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 7,486 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,42,58,778‬కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 82,402 గా ఉంది.