Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కొత్తగా 41 కేసులు.. 24 మంది డిశ్చార్జ్: 1,854కు చేరిన సంఖ్య

తెలంగాణలో ఇవాళ కొత్తగా 41 కరోనా కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,854కి చేరుకుంది. 

41 new coronavirus cases reported in telangana
Author
Hyderabad, First Published May 24, 2020, 8:55 PM IST

తెలంగాణలో ఇవాళ కొత్తగా 41 కరోనా కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,854కి చేరుకుంది. ఆదివారం 24 మంది డిశ్చార్జ్ అవ్వడంతో.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1,092కు చేరింది.

తెలంగాణలో ప్రస్తుతం 709 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ నమోదైన వాటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 23, రంగారెడ్డి జిల్లాలో ఒకటి, ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 11 మంది కూలీలకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. 

కాగా.. ఇంతకుముందు హైదరాబాద్ లో కేసులన్నీ దాదాపుగా పాతబస్తీ ప్రాంతంలోనే నమోదయ్యాయి. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి దాదాపుగా అదుపులోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా శివారు ప్రాంతాలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఇది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. 

Also Read:హైదరాబాద్ లో విజృంభిస్తున్న కరోనా: అంతుచిక్కని మూలాలు

తెలంగాణాలో నమోదవుతున్న కేసుల్లో అన్ని కేసులు కూడా జంటనగరాల పరిధిలోనే నమోదవుతున్నాయి. మిగిలిన జిల్లాల నుంచి కేసులు నమోదు అవడం లేదు. ఇలా కొత్తగా శివారు ప్రాంతాల్లో నమోదవుతున్న కేసుల్లో వారికి ఎటువంటి కాంటాక్ట్ కానీ, ట్రావెల్ హిస్టరీ కానీ ఉండడం లేదు. బయట వస్తువులు కొనడానికో, వైన్ షాపులకు వెళ్ళినప్పుడు అంటించుకుంటున్నవారే ఎక్కువమంది ఉంటున్నారు. 

తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం వరకు 1761 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌వాసులే 1188 మంది ఉన్నారు. ఇప్పటి వరకు మృతి చెందిన 48 మందిలో, జంటనగరాలకు చెందినవారు 42 మంది ఉన్నారు.  

జిహెచ్ఎంసీ పరిధిలో రోజుకి సగటున 30 నుంచి 40 పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 696 యాక్టీవ్ కేసులు ట్రెలంగాణలో ఉన్నాయి. వీరిలో 70 మందికిపైగా పిల్లలు కూడా ఉన్నారు. 

Also Read:హైదరాబాద్ ను వీడని కరోనా మహమ్మారి... శనివారం ఒక్కరోజే 52 పాజిటివ్ కేసులు

శనివారం ఒక్కరోజే కింగ్‌ కోఠి ఆస్పత్రి ఓపీకి 87 మంది రాగా, వీరిలో దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్న 16 మందిని ఇన్‌పేషెంట్లుగా అడ్మిట్‌ చేసుకున్నాయి ఆసుపత్రి వర్గాలు. వీరితో పాటు ఐసొలేషన్‌ వార్డులో మరో ఇద్దరు కూడా ఉన్నారు. ఈ మొత్తం 18 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. 

ఇక ఫీవర్‌ ఆస్పత్రిలో 24 మంది అనుమానితులు ఉన్నారు. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రికి 21 మంది రాగా, వీరిలో 19 మందిని ఇన్‌పేషంట్లుగా అడ్మిట్‌ అయ్యారు. అందులో ముగ్గరికి పాజిటివ్‌ అని తేలగా, వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆయుర్వేద ఆస్పత్రికి నిన్న 10 మంది రాగా, వారి నుంచి నమూనాలు సేకరించి టెస్టులకు పంపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios