తెలంగాణలో కొత్తగా 220 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు. 338 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,351 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కేసుల సంఖ్య భారీగా పడిపోయింది. గడిచిన 24 గంటల్లో 51,004 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 220 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడినవారి సంఖ్య 6,61,006కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 3,892కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 338 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం 5,351 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 98.60 శాతానికి చేరిందని అధికారులు తెలిపారు. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 9, జీహెచ్ఎంసీ 71, జగిత్యాల 6, జనగామ 3, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 11, ఖమ్మం 12, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 2, మంచిర్యాల 4, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 8, ములుగు 4, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 17, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 1 , పెద్దపల్లి 7, సిరిసిల్ల 3, రంగారెడ్డి 12, సిద్దిపేట 6, సంగారెడ్డి 2, సూర్యాపేట 7, వికారాబాద్ 0, వనపర్తి 1, వరంగల్ రూరల్ 9, వరంగల్ అర్బన్ 11, యాదాద్రి భువనగిరిలో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…