Asianet News TeluguAsianet News Telugu

ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా.. ఉలిక్కిపడ్డ సూర్యాపేట

సూర్యాపేట జిల్లాలో ఒకే కుటుంబంలో 22 మందికి కోవిడ్ సోకడం కలకలం రేపింది. కరోనా సోకినవారు ఇటీవల అంత్యక్రియల్లో పాల్గొనట్లు అధికారులు గుర్తించారు. అక్కడ అంత్యక్రియలకు హాజరైన 38 మందిలో 22 మందికి కోవిడ్ నిర్థారణ అయ్యింది.

22 members in one family tests corona in suryapet ksp
Author
Suryapet, First Published Jan 1, 2021, 4:25 PM IST

సూర్యాపేట జిల్లాలో ఒకే కుటుంబంలో 22 మందికి కోవిడ్ సోకడం కలకలం రేపింది. కరోనా సోకినవారు ఇటీవల అంత్యక్రియల్లో పాల్గొనట్లు అధికారులు గుర్తించారు.

అక్కడ అంత్యక్రియలకు హాజరైన 38 మందిలో 22 మందికి కోవిడ్ నిర్థారణ అయ్యింది. దీంతో ఉలిక్కిపడ్డ అధికారులు..  కాలనీ మొత్తం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు .

యుద్ధ ప్రాతిపదికన శానిటేషన్ పనులు చేస్తున్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరిని హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. 

ఇక తెలంగాణలో కొత్తగా 461 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 617 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జి కాగా.. ముగ్గురు మృత్యువాత పడ్డారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,86,815కు చేరింది. వీరిలో 2,79,456 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 5,815 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా కారణంగా 1544 మంది ప్రాణాలు విడిచారు.

Follow Us:
Download App:
  • android
  • ios