Asianet News TeluguAsianet News Telugu

గుడిసెలో తవ్విన కొద్దీ పాము పిల్లలు.. !!

మహబూబ్ నగర్ లో ఓ వింత జరిగింది. ఓ పూరి గుడిసెలో మట్టిని తవ్వితే పాము పిల్లలు బయట పడి కలకలం రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 పాము పిల్లలు బయటపడ్డాయి. దీంతో ఆ గుడిసెలో అప్పటివరకు నివసిస్తున్న మూడు కుటుంబాలు గజగజా వణికిపోయాయి.

21 small snakes found in a hut at addakula, mahabubnagar - bsb
Author
Hyderabad, First Published Mar 17, 2021, 9:16 AM IST

మహబూబ్ నగర్ లో ఓ వింత జరిగింది. ఓ పూరి గుడిసెలో మట్టిని తవ్వితే పాము పిల్లలు బయట పడి కలకలం రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 పాము పిల్లలు బయటపడ్డాయి. దీంతో ఆ గుడిసెలో అప్పటివరకు నివసిస్తున్న మూడు కుటుంబాలు గజగజా వణికిపోయాయి.

వివరాల్లోకి వెడితే.. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులలోని గవర్నమెంట్ కాలేజ్ వెనక భాగంలో ఉండే గుడిసెల్లో మూడు కుటుంబాలు ఉంటున్నాయి. ఈ గుడిసెల్లో బుడగజంగం చిన్న కుర్మన్న ఉంటున్న గుడిసెలో దుర్వాసన వస్తుండడంతో అనుమానంతో గుడిసెలో ఓ మూల మట్టిని తవ్వారు. 

ఆ మట్టిలోనుండి మొదట ఒక పాము పిల్ల బైటికి వచ్చింది. దాన్ని చంపుదామనుకునేలోపు.. ఒకదానివెంట ఒకటిగా వరుసగా మొత్తం 21 పాము పిల్లలు బైటికి వచ్చాయి. వాటిని కర్రతో కొట్టి చంపేశారు. అయితే పది రోజుల కిందట ఇదే గుడిసెలో ఓ పెద్ద పాము కనిపించింది. దాన్ని కూడా ఇలాగే చంపేశారు. గుడిసెలో వీరితో పాటు ఆరుగురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కాగ ఎవరికీ అపాయం కలగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios