నిజామాబాద్ పట్టణంలోని కంఠేశ్వర్ నగర్లో ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు.ఈ ఘటన పట్టణంలో సంచలనం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిజామాబాద్: నిజామాబాద్ పట్టణంలోని కంఠేశ్వర్ నగర్లో ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు.ఈ ఘటన పట్టణంలో సంచలనం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.
శ్రీకాంత్, మహేష్, సాయి అనే యువకులు కంఠేశ్వర్ నగర్లోని ఓ గదిని అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. ఈ ముగ్గురు సమీపంలోని ఓ టీ స్టాల్ను నడుపుతున్నారు.ఈ ఇద్దరిని శ్రీకాంత్ హత్య చేశాడా.. ఇంకా ఎవరైనా ఈ ఘటనకు పాల్పడి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఓ ఇంటి నుండి దుర్వాసన రావడంతో స్తానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా ఆ ఇంటి తలుపులు పగుల గొట్టి చూస్తే రెండు మృతదేహాలు రక్తపు మడుగులో ఉన్నాయి.పోలీసులు డాగ్ స్క్వాడ్ తో ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు.
