నిజామాబాద్లో దారుణం: పిల్లలపైకి దూసుకెళ్లిన కారు, ఇద్దరు చిన్నారుల మృతి
నిజామాబాద్లో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. కమ్మర్పల్లి జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులపైకి కారు దూసుకెళ్లింది.
నిజామాబాద్లో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. కమ్మర్పల్లి జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి.
వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.