Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో 40 వేలకు చేరువలో కరోనా: కొత్తగా 1,597 కేసులు... 11 మంది మృతి

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కొత్తగా 1,597 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 39,342కి చేరింది.

1597 new corona cases reported in telangana
Author
Hyderabad, First Published Jul 15, 2020, 10:39 PM IST

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కొత్తగా 1,597 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 39,342కి చేరింది. తెలంగాణలో ఇవాళ కరోనాతో 11 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 386కి చేరుకుంది.

బుధవారం ఒక్క హైదరాబాద్‌లోనే 796 కరోనా కేసులు నమోదవ్వగా.. ఆ తర్వాత రంగారెడ్డి 212, మేడ్చల్ 115, సంగారెడ్డి 73, నల్గొండ 58, వరంగల్ అర్బన్ 44, కరీంనగర్ 41, పెద్దపల్లి 20, మంచిర్యాల 26, సిద్ధిపేట 27, సూర్యాపేట 14, నిజామాబాద్‌లో 13‌ మందికి పాజిటివ్‌గా తేలింది.

తెలంగాణలో 12,958 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఇవాళ ఒక్కరోజే 1,159 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీటితో కలిపి వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 25,999కి చేరింది. 

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడ ఉచితంగా కరోనా రోగులకు చికిత్స అందించాలని తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం ఫీజులను నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటె ఎక్కువ ఫీజులను వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పలువురు ప్రభుత్వానికి పిర్యాదు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఇద్దరు డాక్టర్లు తమ బాధను సెల్పీ వీడియోల రూపంలో బయటపెట్టారు.  

కరోనా రోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకొన్నారని హైకోర్టు ఈ నెల 14వ తేదీన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.దీంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో  ఉచితంగా కరోనా రోగులకు చికత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios