Asianet News TeluguAsianet News Telugu

విప్రో కొత్త సీఈవో థియరీ డెలాపోర్ట్ జీతం ఎంతో తెలుసా?

విప్రో కొత్త సి‌ఈ‌ఓ థియరీ డెలాపోర్ట్ ఈ సంవత్సరం స్టాక్ ఎంపికలను మినహాయించి దాదాపు 50 కోట్ల రూపాయలు వేతనంగా పొండనున్నారు. మాజీ సీఈఓ అబిదాలి జెడ్ నీముచ్వాలా జీతంతో పోల్చితే ఇది  చాలా ఎక్కువే.
 

Thierry Delaporte to be highest-paid Wipro new CEO in india
Author
Hyderabad, First Published Jun 20, 2020, 5:46 PM IST

ప్రముఖ ఐ‌టి దిగ్గజం, బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ  విప్రో  కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ థియరీ డెలాపోర్ట్ విప్రోలో అత్యధిక పారితోషికం పొందిన సిఇఒగా మాత్రమే కాకుండా, భారతీయ ఐటి టెక్ పరిశ్రమలో  బెస్ట్ పెయిడ్ సీఈవోల జాబితాలో చోటు దక్కించుకోనున్నారు.

జూలై 6 నుండి సీఈఓ, ఎండీగా బాధ్యతలు స్వీకరించనున్న థియరీ డెలాపోర్ట్, ఈ ఏడాది స్టాక్ ఆప్షన్ ప్రయోజనాలతో పాటు దాదాపు 50 కోట్ల రూపాయలు వేతనంగా పొందనున్నారు. 2025 జూలై 5 వరకు అంటే మరో ఐదేళ్లపాటు కంపెనీ సీఈఓగా ఆయనను నియమించినట్లు తాజాగా కంపెనీ ఫైలింగ్ తెలిపింది.

విప్రో మొట్టమొదటి భారతీయేతర సీఈవో థియరీ వేతనంలో కంపెనీలు సీఈవోకు ఇచ్చే సాధారణ నగదు, స్టాక్ ఆప్షన్స్ మాత్రమే  కాకుండా అనేక భాగాలు ఉంటాయి.  

ప్రాథమిక(బేసిక్) వేతనం 9.12-11.9 కోట్లు (సంవత్సరానికి 1.07 మిలియన్ -1.4 మిలియన్ యూరోలు) రూపాయలు, టార్గెట్ వేరియబుల్ పే ఏడాదికి 14.4-21.3 కోట్లు (1.7-2.5 యూరోలు) రూపాయలు. దీంతోపాటు 3.6-4.7 కోట్ల రూపాయల ప్రవాస భత్యాన్ని కూడా కంపెనీ చెల్లించనుంది.

అలాగే వన్-టైమ్ క్యాష్ అవార్డు కింద 3 మిలియన్ డాలర్లు లేదా 22.8 కోట్ల రూపాయలు (జూలై 31, 2020న, జూలై 31, 2021 రెండుసార్లు) అందిస్తుంది.

also read ఫోన్ చార్జ‌ర్‌తో క‌రోనా వైర‌స్ కు చెక్...ఎలా అనుకుంటున్నారా ? ...

 మాజీ సీఈఓ అబిదాలి జెడ్ నీముచ్వాలా జీతంతో పోల్చితే ఇది  చాలా ఎక్కువే. శుక్రవారం రోజు చివరిలో విప్రో సాధారణ స్టాక్ ఒక్కొక్కటి $ 3.3 వద్ద ట్రేడవుతోంది. దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ సీఈవోకు చెల్లించే వార్షికవేతనం కంటే ఇది మూడు రెట్లు ఎక్కువట.  

కాగా ఫ్రాన్స్‌లో జన్మించిన థియరీ డెలాపోర్ట్ విప్రోలో చేరకముందు  కాప్ జెమినిలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. 


టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ జీతం గత ఆర్థిక సంవత్సరంలో 16.04 కోట్ల నుంచి 13.3  కోట్ల రూపాయలకు  తగ్గింది. ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ ఈ ఆర్థిక సంవత్సరం జీతం  34.27 కోట్ల రూపాయలు. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నాని గతేడాది 22.3 కోట్ల  రూపాయల జీతం తీసుకున్నారు.

2018 లో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న ఐటీ సీఈవోగా నిలిచారు. స్టాక్ ఆప్షన్లతో సహా 2020 సంవత్సరానికి మాజీ సీఈఓ వేతనం రూ .32.28 కోట్లుగా ఉంది, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 18.15 శాతం పెరిగింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios