- సంచలనాల రిలయన్స్ జియో ఆధ్వర్యంలో మీడియా టెక్ ప్రాసెసర్తో రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్-3ను ఆవిష్కరించింది.
ముంబై: జియో గిగా ఫైబర్ సేవలను టెలికం దిగ్గజం రిలయన్స్ జియో వాణిజ్యపరంగా అందుబాటులోకి తేనున్నది. సుదీర్ఘ కాలంగా ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత ఈ నెల 12వ తేదీన జరగబోయే 42వ ఏజీఎంలో వాణిజ్యంగా విపణిలోకి ప్రవేశపెట్టనున్నది. ఈ సందర్భంగా జియో తన కస్టమర్లకు మరో శుభవార్త అందించనున్నది.
జియో గిగా ఫైబర్ సేవలతోపాటు జియోఫోన్-2కి కొనసాగింపుగా అప్గ్రేడ్ వెర్షన్తో జియో ఫీచర్ ఫోన్-3ని తీసుకురానున్నది. జియోఫోన్-2 కంటే ఆకర్షణీయ ఫీచర్లతో, దాదాపు అన్ని అంశాలలో మరింత శక్తివంతంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది.
జియో ఫోన్3 ఫీచర్ల పై అధికారిక సమాచారం వెల్లడి కాకున్నా మైస్మార్ట్ప్రైస్ నివేదిక ప్రకారం 4జీ టెక్నాలజీతో జియోఫోన్-3 మీడియా టెక్ చిప్సెట్తో రానుంది. 5 అంగుళాల టచ్ స్క్రీన్తో, పవర్ఫుల్ సాఫ్ట్వేర్ సాయంతో చాలా స్మార్ట్గా జియో ఫోన్-3ని ఆవిష్కరించనుంది.
2 జీబీ ర్యామ్, 64 ర్యామ్ స్టోరేజ్ సామర్ధ్యంతో జియో ఫీచర్ ఫోన్-3 స్మార్ట్ఫోన్ను రానున్నదని తెలిసింది. ధర విషయానికి వస్తే రూ. 4500 అందించనుందని అంచనా. అంతేకాదు 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరిచినట్టు తెలుస్తోంది.
రిలయన్స్ జియో తన తొలి ఫీచర్ ఫోన్ను 2017లో ఆవిష్కరించింది. మలి విడత జియో ఫీచర్ ఫోన్-2ను గతేడాది ఆగస్టు ఏజీఎం సందర్భంగా విపణిలోకి ప్రవేశపెట్టింది. మీడియా టెక్ సంస్థ రిలయన్స్ జియో సంస్థతో కలిసి పని చేస్తుండగా, భారత్లో ఐఓఎస్ సేవల కోసం కా ఓఈఎంతో పని చేస్తోంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 3, 2019, 12:14 PM IST