Asianet News TeluguAsianet News Telugu

దెబ్బ మీద దెబ్బ: జియో ఎఫెక్ట్‌తో దిగ్గజ సంస్థలు 49 లక్షల యూజర్లు లాస్

టెలికం రంగంలో మరో గట్టిపోటీ కనిపిస్తోంది. సెప్టెంబర్​ నెలకు వొడాఫోన్ ఐడియా, భారతీఎయిర్​టెల్​ రెండు కలిపి 49 లక్షల మంది యూజర్లను కోల్పోయాయి. ఇదే సమయంలో జియో 69.83 లక్షల మంది యూజర్లను పెంచుకుంది.

Jio adds 70 lakh users; Voda Idea, Airtel loses 49 lakh users
Author
Hyderabad, First Published Nov 20, 2019, 1:49 PM IST

న్యూఢిల్లీ: వొడాఫోన్-ఐడియా, భారతీ ఎయిర్​టెల్​ సంస్థలను కష్టాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. సెప్టెంబర్ నెలలోనూ భారీగా యూజర్లను కోల్పోయాయి. ఈ రెండు సంస్థలకు కలిపి సెప్టెంబర్​లో 49 లక్షల మంది యూజర్లు దూరమైనట్లు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్​) తెలిపింది. 

aslo read  ఐటీ ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నారు...ఎందుకంటే ?

రిలయన్స్ జియో మాత్రం సెప్టెంబర్​లో 69.83 లక్షల మంది కొత్త యూజర్లను దక్కించుకున్నట్లు ట్రాయ్​ గణాంకాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్​ నెలలో జీఎస్​ఎం, సీడీఎంఐ, ఎల్​టీఈ సహా మొత్తం వైర్​లెస్​ చందాదారులు 117.37 కోట్ల మందికి పెరిగారు. ఈ సంఖ్య ఆగస్టు నెలాఖరు నాటికి 117.1కోట్లుగా ఉంది.

పట్టణ ప్రాంతాల్లో వైర్​లెస్​ చందాదారుల సంఖ్య 65.91 కోట్లకు తగ్గగా.. గ్రామీణ ప్రాంతాల్లో 51.45 కోట్లకు పెరిగింది. నెట్​వర్క్​ల వారీగా చూస్తే సెప్టెంబర్​ చివరి నాటికి సెప్టెబర్​లో వొడాఫోన్-ఐడియా అత్యధికంగా 25.7 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.

also read  జియో కస్టమర్లకు మరో బ్యాడ్ న్యూస్...చార్జీల పెంపు..

భారతీ ఎయిర్​టెల్​కు సెప్టెంబర్​లో 23.8 లక్షల మంది యూజర్లు తగ్గారు. సెప్టెంబర్​లో 69.83 లక్షల మంది కొత్తగా రిలయన్స్ జియోను ఎంచుకున్నారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు.. బీఎస్​ఎన్​ఎల్​ 7.37 లక్షల యూజర్లను సెప్టెంబర్​లో పెంచుకోగా, ఎంటీఎన్​ఎల్ మాత్రం 8,717 మంది యూజర్లను కోల్పోయింది.

సెప్టెంబర్​ నాటికి వొడాఫోన్​-ఐడియా యూజర్లు 37.24 కోట్ల మంది కాగా, అది మార్కెట్లో 31.73 శాతం. భారతీఎయిర్​టెల్​ సబ్ స్క్రైబర్లు 32.55 కోట్ల మంది కాగా, మార్కెట్లో వాటా 27.74 శాతం. రిలయన్స్ జియో వినియోగదారులు 35.52 కోట్ల మంది కాగా, మార్కెట్లో వాటా 30.26 శాతం. బీఎస్​ఎన్​ఎల్​ యూజర్లు 11.69 కోట్ల మంది కాగా, ఎంటీఎన్​ఎల్ కస్టమర్లు 33.93 లక్షల మందిగా ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios