ఈ నెల ప్రారంభంలో US ఆఫీస్ నుండి కొంతమంది కీలక ఉద్యోగులను తొలగించిన తర్వాత Google కొత్త ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేసింది. కంపెనీ కొంత మందిని కూడా భారత్‌కు తరలించినట్లు సమాచారం. 

టెక్ దిగ్గజం Google బెంగళూరు ఆఫీస్ యునైటెడ్ స్టేట్స్ తరువాత కంపెనీ అతిపెద్ద ఇంకా అత్యంత ముఖ్యమైన ఆఫీసులలో ఒకటి. ప్రస్తుతం ఈ కంపెనీ బెంగళూరులో కొత్త స్థలాన్ని లీజుకు తీసుకుంది. అయితే దీని అద్దె(rent) నెలకు 4 కోట్ల పైమాటే.

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని అలెంబిక్ సిటీలో 649,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని గూగుల్ లీజుకు తీసుకుంది. చ.అ.కు ప్రతినెలా అద్దె రేటుతో మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో ఆఫీస్ లీజుకు ఇవ్వబడింది. అయితే రూ.4,02,38,000 ప్రతినెలా అద్దె మొత్తం. అంటే నెలకు 4 కోట్లకు పైగా అద్దె చెల్లించాల్సి వస్తోంది. 

ఈ నెల ప్రారంభంలో US ఆఫీస్ నుండి కొంతమంది కీలక ఉద్యోగులను తొలగించిన తర్వాత Google కొత్త ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేసింది. కంపెనీ కొంత మందిని కూడా భారత్‌కు తరలించినట్లు సమాచారం.

నివేదిక ప్రకారం, 2022లో, Google Connect Services India Pvt. లిమిటెడ్ హైదరాబాద్‌లో 600,000 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కోసం లీజును రెన్యూవల్ చేసింది. బెంగళూరులోని బాగ్‌మనే డెవలపర్స్( Bagmane Developers ) నుండి 1.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకోవడానికి కూడా గూగుల్ అంగీకరించింది. 

2020 నాటికి భారతదేశంలో గూగుల్ ఆఫీస్ స్పేస్ పోర్ట్‌ఫోలియో 3.5 మిలియన్ చదరపు అడుగుల మేర విస్తరించింది. కంపెనీ ఇప్పుడు భారతదేశంలోని ఐదు నగరాల్లో 9.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ నిర్వహిస్తోంది. అంతేకాదు భారత్‌లో గూగుల్ తన ఉనికిని మరింత విస్తరిస్తోంది. 

తమిళనాడులోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీలో స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసి రాష్ట్రంలో డ్రోన్ ఉత్పత్తిని ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. భారతదేశంలో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తి పిక్సెల్ 8 మోడల్‌తో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

గత సంవత్సరం జరిగిన గూగుల్ ఫర్ ఇండియా కాన్ఫరెన్స్‌లో, కంపెనీ మొదట పిక్సెల్ ఫోన్‌ల ఉత్పత్తిని ప్రారంభించే ప్లాన్స్ రూపొందించింది.