Asianet News TeluguAsianet News Telugu

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా చరిత్రలోనే మొట్టమొదటి రెవెన్యూ డ్రాప్.. గత సంవత్సరంతో పోలిస్తే క్షీణత..

మెటా  మొట్టమొదటి రెవెన్యూ తగ్గుదల  యాడ్ బిజినెస్ ఆర్థిక మందగమనం ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశిస్తుందనే ఆందోళనల మధ్య ప్రకటనదారులు వెనక్కి తగ్గుతున్నారు.  

Facebook parent company Meta reports first-ever losses for global tech giant
Author
Hyderabad, First Published Jul 28, 2022, 9:48 AM IST


సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా బుధవారం  చరిత్రలోనే మొదటిసారిగా ఆదాయం తగ్గిందని నివేదించింది. పెరుగుతున్న ఆర్థిక ఆందోళనల మధ్య యాడ్ సేల్స్ తగ్గిపోయి, సోషల్ మీడియా దిగ్గజం రెండవ త్రైమాసికంలో ఆదాయ అంచనాలను కూడా కోల్పోయింది. 

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో  మెటా $28.8 బిలియన్ల ఆదాయాన్ని నివేదించింది, అయితే గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 1% క్షీణత. థామ్సన్ రాయిటర్స్ ద్వారా అనలిట్స్ సర్వే ఊహించిన $28.9 బిలియన్లను కంపెనీ పనితీరు తృటిలో కోల్పోయింది. మెటా ఒక్కో  షేరుకు $2.56 అంచనాలు పెట్టుకోగా, కానీ ఒక్కో షేరుకు $2.46 సంపాదించింది.

మెటా  మొట్టమొదటి రెవెన్యూ తగ్గుదల  యాడ్ బిజినెస్ ఆర్థిక మందగమనం ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశిస్తుందనే ఆందోళనల మధ్య అడ్వటైజర్స్ వెనక్కి తగ్గుతున్నారు.  

మెటా ఆదాయ సవాళ్లను అధిగమించడానికి ఖర్చులను తగ్గించింది అలాగే  నియామకాలని ఆపేసింది. మూడవ త్రైమాసికంలో కంపెనీ అంచనాలు కూడా విశ్లేషకులు ఊహించిన దాని కంటే తక్కువగా ఉన్నాయి. ఆదాయం $26 బిలియన్ల నుండి $28.5 బిలియన్ల పరిధిలో ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మెటా తెలిపింది, అంటే $30.5 బిలియన్ల అంచనాల కంటే తక్కువ.

"మేము ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించినట్లు అనిపిస్తుంది, ఇది డిజిటల్ యాడ్స్ వ్యాపారంపై  ప్రభావాన్ని చూపుతుంది" అని మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ విశ్లేషకులతో తెలిపారు.  

 షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్ TikTok అండ్ ఫోటో-షేరింగ్ యాప్ BeReal వంటి యాప్‌ల నుండి కంపెనీ మరింత పోటీని ఎదుర్కొంటోంది. ఫేస్‌బుక్, ఫోటో అండ్  వీడియో-షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ సేల్స్ ద్వారా మెటా ఇప్పటికీ ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది. 

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ టిక్‌టాక్‌తో పోటీ పడటానికి మార్పులు చేస్తున్నందున యూజర్లను కలవరపెడుతోంది. Instagram TikTok లాగా కనిపించే ఫుల్ స్క్రీన్ ఫీడ్‌ను పరీక్షిస్తోంది. సోమవారం,  కిమ్ కర్దాషియాన్ అండ్ కైలీ జెన్నర్ ప్రముఖ వీడియో యాప్‌ను అనుకరించే ప్రయత్నాన్ని ఆపాలని అండ్ ఫోటో షేరింగ్‌పై దృష్టి పెట్టాలని కంపెనీని కోరుతూ షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మొస్సేరి మంగళవారం ఒక ట్వీట్‌లో మాట్లాడుతూ మా ప్లాట్‌ఫారమ్ ఫోటో షేరింగ్‌కు మద్దతునిస్తూనే ఉంటుంది, అయితే ఈ యాప్ కాలక్రమేణా మరిన్ని వీడియోలతో ఉంటుందని నమ్ముతున్నానని అన్నారు. 

"కానీ ఇన్‌స్టాగ్రామ్ ఈ (యూజర్ ఇంటర్‌ఫేస్) మార్పును సరిగ్గా పొందాలని లేదా  బిగ్ ఫ్యాన్స్ ని కోల్పోయే ప్రమాదం ఉందని హబ్బబ్ క్రిస్టల్ స్పష్టం చేస్తుంది" అని ఆమె చెప్పారు.

జుకర్‌బర్గ్ మాట్లాడుతూ ప్రజలు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో  కనెక్ట్ అవ్వడంలో కంపెనీ ఇప్పటికీ దృష్టి సారించిందని చెప్పారు. సోషల్ మీడియా వినియోగదారులు  ఫీడ్‌లలో ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ను కనుగొని, ఆ కంటెంట్‌ను స్నేహితులకు పంపుతున్నారని ఆయన చెప్పారు. 

ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రజలు  షార్ట్-ఫారమ్ వీడియో ఫీచర్ రీల్స్‌పై గడిపే సమయం 30% కంటే ఎక్కువ పెరుగుదల కనిపించిందని కంపెనీ తెలిపింది.

రెండవ త్రైమాసికంలో, 2.88 బిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ వంటి మెటా యాప్‌లలో ఒకదాన్ని రోజూ ఉపయోగిస్తున్నారు, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే  4% పెరిగింది. 

Meta స్టాక్ గంటల ట్రేడింగ్‌లో 4% కంటే ఎక్కువ పడిపోయి ఒక్కో షేరుకు $161.86కి చేరుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios