ఎయిర్ మౌస్, ఫ్రేమ్లెస్ డిజైన్ తో దైవా 4కె స్మార్ట్ టివి.. తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్స్ తో లాంచ్..
ఇండియన్ కంపెనీ దైవా ఒక కొత్త 4కె అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టివి ధర రూ.39,990.దీనికి క్వాడ్కోర్ ప్రాసెసర్, కనెక్టివిటీ కోసం బ్లూటూత్ కూడా ఉంది.
దేశీయ స్మార్ట్ టీవీ సంస్థ దైవా 4కె యుహెచ్డి డి50162ఎఫ్ఎల్ పేరుతో వస్తున్న కొత్త 4కె అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీని భారతదేశంలో విడుదల చేసింది. ఈ టీవీ ఆండ్రాయిడ్ టివి 9లోని బిగ్వాల్ యుఐతో పనిచేస్తుంది.
ఈ టివి ఫ్రేమ్లెస్ డిజైన్, హెచ్డిఆర్10 సపోర్ట్ తో తీసుకొచ్చారు. దైవా 4కె యుహెచ్డి స్మార్ట్ టివి ప్రస్తుతం 50 అంగుళాల సైజులో మాత్రమే లభిస్తోంది. దీనికి క్వాడ్కోర్ ప్రాసెసర్, కనెక్టివిటీ కోసం బ్లూటూత్ కూడా ఉంది.
ధర ఇంకా స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ టివి ధర రూ.39,990. దీని ఫీచర్స్ గురించి చెప్పాలంటే దీనికి 50 అంగుళాల 4కె స్క్రీన్, 3840x2160 పిక్సెల్ రిజల్యూషన్, డిఎల్ఈడి ప్యానెల్ తో 1.07 బిలియన్ కలర్స్, హెచ్డిఆర్ 10 సపోర్ట్ ఇచ్చారు. టివి మూడు వైపుల ఫ్రేమ్లెస్ డిజైన్ తో కింద భాగంలో బేసెల్ ఫ్రేమ్ ఉంటుంది. 60Hz స్క్రీన్ రిఫ్రెష్ రేటుతో 20 వాట్ల స్పీకర్ లభిస్తుంది.
దైవా నుండి వస్తున్న ఈ టీవీలో మాలి-జి31 ఎంపి 2 జిపియుతో ఎ55 ప్రాసెసర్ అందించారు. దీనిలో 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఉంటుంది. కనెక్టివిటీ కోసం 2.4GHz వై-ఫై, బ్లూటూత్, మూడు హెచ్డిఎంఐ పోర్ట్లు, రెండు యుఎస్బి పోర్ట్లు, ఆప్టికల్ అవుట్ పోర్ట్, ఈథర్నెట్, హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి.
అంతేకాకుండా ఈ టీవీలో స్క్రీన్ మిర్రరింగ్ ఇచ్చారు, ఇది ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. దీనికి ఎయిర్ మౌస్ కూడా ఉంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ + హాట్స్టార్, జీ5, సోనీ లివ్, వూట్ వంటి యాప్స్ కి ఈ టీవీకి సపోర్ట్ చేస్తుంది. దీని బరువు 9 కిలోలు.