కనీస మొత్తం కంటే తక్కువ UPI ట్రాన్సక్షన్స్ పై బ్యాంక్ కస్టమర్లు ఇక టెక్స్ట్ మెసేజెస్ పొందలేరు. తాజాగా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది, కానీ ఈ రూల్ వెంటనే అమలులోకి రావడం లేదు.
ముంబై : మీకు అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు HDFC బ్యాంక్ గురించి తెలిసే ఉండాలి. మీరు ఈ బ్యాంక్ కస్టమర్ అయితే, మీకోసం ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. కనీస మొత్తం కంటే తక్కువ UPI ట్రాన్సక్షన్స్ పై బ్యాంక్ కస్టమర్లు ఇక టెక్స్ట్ మెసేజెస్ పొందలేరు. తాజాగా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది, కానీ ఈ రూల్ వెంటనే అమలులోకి రావడం లేదు. ఈ నిర్ణయం వచ్చేనెల 25 నుంచి అమలులోకి రానుంది.
Add Asianetnews Telugu as a Preferred Source


HDFC బ్యాంక్ నిర్ణయం ఏమిటి?
హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లకు పంపిన సమాచారంలో, జూన్ 25, 2024 నుండి మీ SMS అలర్ట్ సర్వీస్లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలియజేసింది. ఇప్పుడు మీరు UPI ద్వారా ఎవరికైనా రూ. 100 కంటే ఎక్కువ డబ్బు పంపితే అప్పుడు మాత్రమే SMS అలెర్ట్ వస్తుంది. అదేవిధంగా మీరు రూ. 500 కంటే ఎక్కువ అందుకున్నట్లయితే, అప్పుడు మాత్రమే SMS అలెర్ట్ పంపబడుతుంది.
