ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్‌లో  క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి.   దీని ప్రభావం భారత్‌లోని  ఇంధన ధరలపై అంతగా కనిపించలేదు. WTI క్రూడ్ బ్యారెల్‌కు $ 1.36  డాలర్లు పెరిగి $ 71.15 డాలర్లు వద్ద విక్రయించబడింది అలాగే  బ్రెంట్ క్రూడ్ $ 0.14 తగ్గి బ్యారెల్‌కు $ 76.12 డాలర్లు వద్ద ఉంది.  

నేడు జూలై 5 బుధవారంన దేశ రాజధాని న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై ఇంకా  చెన్నైలో  పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రతి రోజు ఇంధన ధరలు కొత్తవి లేదా మారకపోయినా  ఉదయం 6 గంటలకు ప్రకటించబడతాయి. అయితే, ఇవి విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.

ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్‌లో  క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి.   దీని ప్రభావం భారత్‌లోని  ఇంధన ధరలపై అంతగా కనిపించలేదు. WTI క్రూడ్ బ్యారెల్‌కు $ 1.36  డాలర్లు పెరిగి $ 71.15 డాలర్లు వద్ద విక్రయించబడింది అలాగే  బ్రెంట్ క్రూడ్ $ 0.14 తగ్గి బ్యారెల్‌కు $ 76.12 డాలర్లు వద్ద ఉంది.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా  ఉంది.

నేడు రాజస్థాన్‌లో పెట్రోల్ 81 పైసలు, డీజిల్ 73 పైసలు తగ్గాయి. ఛత్తీస్‌గఢ్‌లో పెట్రోల్‌పై 50 పైసలు, డీజిల్‌పై 49 పైసలు తగ్గాయి. అదేవిధంగా బీహార్, హిమాచల్, ఎంపీ, ఉత్తరప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. మరోవైపు మహారాష్ట్రలో పెట్రోల్ ధర 59 పైసలు, డీజిల్ 57 పైసలు పెరిగింది. జార్ఖండ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు 22 పైసలు పెరిగాయి.

హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర లీటరుకు రూ.97.82. 

భారతదేశంలో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్   డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇవి రోజువారీ ప్రాతిపదికన చేయబడుతుంది ఇంకా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరలకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.