మొబైల్ రీఛార్జ్  వాలిడిటీని 28 రోజులకు బదులుగా 30 రోజులకు పెంచాలని ట్రాయ్  అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. చాలా టెలికాం కంపెనీలు ఒక నెల పేరుతో కేవలం 28 రోజుల వాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి, దీని గురించి ట్రాయ్ కి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి.

మొబైల్ వినియోగదారులకు శుభవార్త. పెరుగుతున్న టెలికాం కంపెనీల ఏకపక్షం, కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మొబైల్ రీఛార్జ్ వాలిడిటీని 28 రోజులకు బదులుగా 30 రోజులకు పెంచాలని ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. చాలా టెలికాం కంపెనీలు ఒక నెల పేరుతో కేవలం 28 రోజుల వాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి, దీని గురించి ట్రాయ్ కి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి.

టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను నిరంతరం పెంచుతున్నాయని, అయితే వాలిడిటీ తగ్గుతోందని వినియోగదారులు ఆరోపించారు. దీంతో ప్రతి సంవత్సరం అదనపు రీఛార్జ్ చేయవలసి వస్తుంది. కస్టమర్ల నుండి నిరంతరంగా దీనిపై ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత ట్రాయ్ ఈ చర్య తీసుకుంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ ఆర్డర్ తర్వాత టెలికాం కంపెనీలు వాలిడిటీని పెంచుతాయా అని ? 

చాలా టెలికాం కంపెనీలు 15 రోజులకు బదులుగా 14 రోజులు, 30 రోజులకు బదులుగా 28, 60 రోజులకు బదులుగా 56, 90కి బదులుగా 84 రోజుల వాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్‌లను 30 రోజులకు పెంచాలని ట్రాయ్ టెలికాం కంపెనీలను కోరలేదు. ఇందుకు బదులుగా టెలికాం కంపెనీలు ఇప్పుడు వాటి ప్లాన్‌లలో మొత్తం నెల రోజుల వాలిడిటీతో ప్రత్యేక వోచర్, కాంబో వోచర్‌ అందించాలని ట్రాయ్ తెలిపింది. 

ట్రాయ్ ఆర్డర్ ప్రకారం, టెలికాం కంపెనీలు ఒక ప్రత్యేక వోచర్, కాంబో వోచర్‌ను నెల మొత్తం వాలిడిటీతో అందిస్తే కస్టమర్లకు మరిన్ని ఆప్షన్స్ ఉంటాయి. కానీ టెలికాం కంపెనీలు ఎక్కువ ఖర్చుతో 30 రోజుల ప్లాన్ లను ప్రారంభించవచ్చు. అంటే మొత్తం 28 రోజుల వాలిడిటీ ప్లాన్‌లు 30 రోజులు ఉంటాయి, ఒకవేళ ఇలా జరిగిన లేదా జరగకపోయిన వాటి ధర పెరగవచ్చు.

టెలికాం కంపెనీలు 30 రోజులకు బదులుగా 28 రోజుల వాలిడిటీ కారణంగా చాలా అర్జీస్తున్నాయి. ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉన్నందున వినియోగదారులు సంవత్సరానికి 12 సార్లకు బదులుగా 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. దీని వల్ల కస్టమర్ల జేబులకు చిల్లులు పడుతుండగా, కంపెనీలకే ఎక్కువ లాభం వస్తుంది. దీంతో టెలికాం కంపెనీలు వాటి ప్లాన్‌లను 28 రోజుల నుండి 30 రోజులకు పెంచకపోవచ్చు. కానీ టెలికాం కంపెనీలు కొత్త ధరలతో 30-రోజుల వాలిడిటీ ప్లాన్లను ప్రారంభించవచ్చు.