Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్: 15 రోజులకోసారి ఆఫీసుకు వస్తే చాలు..

దేశంలోని ఐటీ దిగ్గజ సంస్థలు తమ సిబ్బందిని ఇప్పట్లో ఆఫీసులకు రావాలని ఆదేశించేలా కనిపించడం లేదు. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరగడమే దీనికి కారణం. పలు సంస్థలు 10 శాతం నుంచి 50 శాతం సిబ్బంది వరకు వర్క్ ఫ్రం హోంకే అనుమతినిస్తున్నాయి. ఎప్పుడు ఆఫీసుకు రావాలన్నా వారి ఇష్టం అని గోల్డ్ మన్ శాక్స్ తెలిపింది. 15 రోజులకోసారి ఆఫీసుకు వస్తే చాలని సెర్చింజన్ పేర్కొంది. 
 

Tech Companies In No Hurry To Return To Office
Author
Hyderabad, First Published Jun 16, 2020, 12:23 PM IST

బెంగళూర్‌: లాక్‌డౌన్‌ నియంత్రణలను కేంద్ర ప్రభుత్వం భారీగా సడలించినా పలు ఐటీ, టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికి ఇప్పుడు కార్యాలయాల్లో పూర్తిస్ధాయి సిబ్బందితో పనిచేయించేందుకు సిద్ధంగా లేవు. ఐటీ, టెక్నాలజీ కంపెనీలు ఇంటర్‌నెట్‌తో తమ పనులు చక్కబెట్టుకునే అవకాశం ఉండటంతో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నా ఉత్పాదకతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపడం లేదు.

కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న క్రమంలో మరికొద్ది నెలలపాటు ఇదే విధానాన్ని కొనసాగించాలని ఐటీ కంపెనీలు యోచిస్తున్నాయి. కార్యాలయాల్లో నామమాత్రపు సిబ్బందిని అనుమతించాలని, అదీ రొటేషన్‌ విధానంలో అనుసరించాలని మరికొన్ని కంపెనీలు భావిస్తున్నాయి.

ఉద్యోగుల వెసులుబాటుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని పలు ఐటీ కంపెనీలు యోచిస్తున్నాయి. 5,500 మంది ఉద్యోగులు పని చేస్తున్న గోల్డ్‌మన్‌ శాక్స్‌ బెంగళూర్‌ సర్వీస్‌ సెంటర్‌లో మరికొద్ది నెలల పాటు కేవలం 30 శాతం మందిని కార్యాలయం నుంచి పనిచేయించాలని కంపెనీ భావిస్తోంది. 

also read వివో మరో ఆకర్షణీయమైన స్మార్ట్ ఫోన్...కొత్తగా లాంచ్‌..

జూన్‌ మాసాంతంలో దశల వారీగా సిబ్బందిని అనుమతించాలని గోల్డన్ మన్ శాక్స్ భావిస్తోంది. ఆఫీస్‌ నుంచి తిరిగి పని చేయడమనేది ఉద్యోగులు స్వచ్ఛందంగా వారి వెసులుబాటు, సౌకర్యాన్ని బట్టి వారే నిర్ణయం తీసుకుంటారని గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇండియా హెడ్‌ గుంజన్‌ సంతాని పేర్కొన్నారు.

ఇక ఉద్యోగి ప్రతి రెండు వారాలకు ఒక రోజు ఆఫీస్‌లో పనిచేసే విధానంపై సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్‌ కసరత్తు సాగిస్తోంది. తమ కార్యాలయ భవనాల్లో పది శాతం ఉద్యోగులు మాత్రమే ఉండేలా గూగుల్‌ యోచిస్తోంది.

ఇక సెప్టెంబర్‌ నాటికి భవనాల సామర్ధ్యంలో 30% వరకూ ఉద్యోగులను రొటేషన్‌ విధానంలో అనుమతించాలని గూగుల్ యోచిస్తోంది. 

మరోవైపు సిబ్బంది నిర్మాణాత్మకంగా పని చేస్తే ఈ ఏడాదంతా ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటును ఉద్యోగులకు కల్పిస్తామని ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. తొలుత 25 శాతం సిబ్బందితో కార్యాలయాలను తెరిచేందుకు ఫేస్‌బుక్‌ సన్నాహాలు చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios