Asianet News TeluguAsianet News Telugu

ఆధార్​ అప్​డేట్ కు​ గ్రీన్ సిగ్నల్..తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు...

దేశవ్యాప్తంగా 20వేల కామన్​ సర్వీస్​ సెంటర్లకు ఆధార్​ అప్​డేట్​ బాధ్యతలు అప్పగించింది ఉడాయ్​. ఇందుకోసం కొన్ని షరతులతో కూడిన అనుమతులిచ్చింది. దీంతో జనాభా, సంతానం, చిరునామాలో మార్పులను అప్​డేట్​ చేసుకోవచ్చు.
 

Around 20,000 Aadhar customer centres get permission to update Aadhaar details
Author
Hyderabad, First Published Apr 28, 2020, 11:03 AM IST

న్యూఢిల్లీ: ఆధార్​ వివరాలను అప్​డేట్​ చేసేందుకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా సుమారు 20వేల కామన్​ సర్వీస్​ సెంటర్లకు (సీఎస్​సీ) భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) అనుమతులు ఇచ్చింది. ఈ సీఎస్​సీలు బ్యాంకింగ్​ కరెస్పాండెంట్లుగా పని చేస్తాయని స్పష్టం చేసింది.

అయితే ఇవి షరతులతో కూడిన అనుమతులేనని పేర్కొంటూ ఈ నెల 24వ తేదీన సీఎస్​సీ ఈ-గవర్నెన్స్​ సర్వీసెస్​ సీఈఓ దినేశ్​ త్యాగికి ఉడాయ్ లేఖ రాసింది. కేవలం జనాభాకు సంబంధించిన వివరాలకే అనుమతులు ఉన్నాయని స్పష్టం చేసింది. 

వేలిముద్రలు, ఐరిస్​ అనే సాఫ్ట్​వేర్​ సహాయంతో ఆపరేటర్లు, నివాసితుల ప్రమాణీకరణ జరుగుతుందని ఆధార్ తెలిపింది. ఈ ఏడాది జూన్​కల్లా ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. సంతానం, చిరునామాలోని మార్పులు, తదితర బయోమెట్రిక్​ వివరాలను సీఎస్​సీలు అప్​డేట్​ చేస్తాయి. ఫ్రెష్ ఆధార్ నంబర్ రిజిస్ట్రేషన్లు కూడా సీఎస్సీలు చేపడతాయి.

also read వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్.. డబుల్ డేటా ఆఫర్‌ తో ఫ్రీ సబ్ స్క్రిప్షన్ కూడా...

గ్రామీణులకు ఈ సదుపాయం అధికంగా ఉపయోగపడుతుందని కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ అభిప్రాయపడ్డారు. ఉడాయ్​ నిబంధనలకు అనుగుణంగా, బాధ్యతాయుతంగా ఈ పని చేపట్టాలని సీఎస్​సీ సభ్యులకు సూచించారు. 

ఈ మేరకు సీఎస్సీకి ఉడాయ్ అనుమతులిచ్చిన సంగతిని రవిశంకర్ ప్రసాద్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆధార్​లో మార్పులు చేయడానికి జిల్లాస్థాయిలోని సీఎస్​సీ ఈ-గవర్నెన్స్​ సర్వీసులకు ఇప్పటికే  ఉడాయ్​ అనుమతిలిచ్చింది.

గ్రామీణులకు సిటిజన్ సేవలందించేందుకు దేశవ్యాప్తంగా 2.74 లక్షల సీఎస్సీలు విధులు నిర్వర్తిస్తున్నాయి. ఇంతకుముందు 2018 డిసెంబర్ నెలలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో సీఎస్సీలు ఆధార్ అప్ డేట్ ప్రక్రియను నిలిపివేశాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios