Asianet News TeluguAsianet News Telugu

మీ డెబిట్/క్రెడిట్ కార్డులు 16లోపు వాడండి లేదంటే...

మీరు డెబిట్, క్రెడిట్ కార్డులను పక్కన బెట్టారా? అంతా ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారా? అయితే ఒక్క విషయం ఈ నెల 16లోగా ట్రాన్సాక్షన్లు జరుపకుంటే అవి శాశ్వతంగా డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది. 
 

Alert! These debit, credit cards will be disabled permanently from March 16
Author
Hyderabad, First Published Mar 8, 2020, 10:58 AM IST

న్యూఢిల్లీ: భీమ్, ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ వచ్చాక డెబిట్ కార్డులను నేరుగా వాడేవారు చాలా వరకు తగ్గిపోయారు. అంతా యాప్‌తో స్కాన్ చేసి పేమెంట్లు చేసేస్తున్నారు. ఇలా అలవాటు పడి పోయి మీరు డెబిట్ కార్డును అసలు వాడకుంటే ఉంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. 

మీరు కార్డును కొనసాగించాలంటే ఈ నెల 16వ తేదీలోపు కాంటాక్ట్ లెస్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ తప్పనిసరిగా చేయాలి. లేదంటే శాశ్వతంగా మీ కార్డులో ఆ సేవలు పర్మినెంట్‌గా బ్లాక్ అయిపోతాయి. కార్డుల సెక్యూరిటీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ నిర్ణయం తీసుకంది. ఈ ఏడాది జనవరి 15వ తేదీన ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది.

also read మీ స్మార్ట్ ఫోన్ తో కరోనా వైరస్ కు చెక్...ఎలా అంటే ?

ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం డెబిట్ కార్డులతో పాటు క్రెడిట్ కార్డులకు కూడా ఆన్‌లైన్, కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ చేయడం తప్పనిసరి. క్రెడిట్ కార్డు తీసుకుని ఇంత వరకు ఒక్కసారి కూడా ఆన్‌లైన్, కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ చేయకుంటే అది పని చేయదు. 

ఈ రెండు సర్వీసులూ ఆ తర్వాత కూడా వాడుకోవాలనుకుంటే ఒక్కసారైనా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులను వినియోగించి తీరాలి. లేదంటే మీ కార్డుపై ఆ సర్వీసులు డీఫాల్ట్‌గా బ్లాక్ అయిపోతాయి. ఆ తర్వాత మీ కార్డుతో ఆన్‌లైన్, కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మళ్లీ కొత్త డెబిట్/క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకుని, తీసుకోవాల్సి వస్తుంది. 

సెక్యూరిటీ దృష్ట్యా అన్ని క్రెడిట్/డెబిట్ కార్డు ఇష్యూయర్, బ్యాంకులకు ఈ ఆదేశాలను జారీ చేసింది ఆర్బీఐ. అలాగే ఈ ట్రాన్సాక్షన్లు చేస్తున్నా ఏవైనా కార్డులను రిస్కు ఆధారంగా నేరుగా బ్యాంకులే బ్లాక్ చేసేందుకు వీలు కల్పిస్తూ జనవరిలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో వాటికి సూచన చేసింది. అయితే ఇలా బ్లాక్ చేసేట్లయితే యూజర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వాలని పేర్కొంది.

also read మార్చి 19న నోకియా 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్...

కార్డు యూజర్లు వాటి లిమిట్ లాక్ పెట్టుకోవడం, కార్డులను సొంతంగా బ్లాక్ చేసుకోవడం వంటి ఆప్షన్లను వారికి కల్పించాలని బ్యాంకులకు సూచించింది. 24/7 బేసిస్‌లో ఐవీఆర్, ఎస్ఎంఎస్, మొబైల్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి మార్గాల్లో ఈ ఆప్షన్లను వాడుకునే వీలుండాలని పేర్కొంది. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని సెక్షన్ 10(2) ప్రకారం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్బీఐ.

ఇటీవల డెబిట్, క్రెడిట్ కార్డులు వైఫై సింబల్‌తో వస్తున్నాయి. ఈ స్మార్ట్ కార్డులను స్వైపింగ్ మెషీన్లలో గీకాల్సిన పని లేదు. జస్ట్ పైన పెట్టి స్కాన్ చేస్తే రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పేమెంట్ పూర్తవుతుంది. కొన్ని చోట్ల క్యూఆర్ స్కాన్ లాంటి మెషీన్‌తో కూడా ట్రాన్సాక్షన్ చేసే వీలుంటుంది. వీటినే కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్స్ అంటారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios