జయ మరణంపై విచారణ, అన్నాడీఎంకే అవినీతిపై ప్రత్యేక కోర్టు: డీఎంకే మేనిఫెస్టో ఇదే..!!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే 173 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ.. శనివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే 173 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ.. శనివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు.
మేనిఫెస్టోలోని అంశాలు:
- విద్య, ఉపాధి, ఆర్ధికాభివృద్ధికి మేనిఫెస్టోలో ప్రాధాన్యత
- అన్నాడీఎంకే మంత్రుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టులు
- పెంచిన ఆస్తి పన్ను రద్దు
- హిందూ ఆలయాల పునరుద్దరణకు వెయ్యి కోట్లు
- అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు
- వంట గ్యాస్ సిలిండర్పై రూ.100 సబ్సిడీ
- మసీదు, చర్చిల పునరుద్దరణకు రూ.200 కోట్లు
- ప్రభుత్వ ఉద్యోగాల్లో 40 శాతం మహిళలకు అవకాశం
- జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమీషన్
- ఆవిన్ పాల ధర లీటర్పై రూ.3 తగ్గింపు
- మహిళలకు ప్రసూతి సెలవులు 12 నెలలకు పెంపు
- నీట్ పరీక్ష రద్దుకు శాసనసభ తొలి సమావేశంలో ఆర్డినెన్స్
- కార్మికులకు పాత పింఛన్ పథకం అమలు
- జయలలిత మరణంపై విచారణ వేగవంతం
- కరుణానిధి పేరుతో కలైంజర్ క్యాంటీన్ల ఏర్పాటు