May 13, 2025, 1:54 PM IST
జలంధర్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని పిఎం మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్, ఇతర ఉద్యోగులతో మాట్టాడారు. ఆపరేషన్ సిందూర్ లో కీలకంగా వ్యవహరించిన ఐఎఎఫ్ సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపేలా ప్రధాని మోదీ పర్యటన ఉంది.
May 9, 2025, 11:09 PM IST
భారతపాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య నిత్యావసరాల ధరల పెరగకుండా.. వాటి నిల్వలను సమీక్షించాలని.. బ్లాక్ మార్కెట్, దళారులపై చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. భారత–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
May 8, 2025, 1:01 PM IST
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్చీ గురువారం నాడు భారత్కు వచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 20వ ఇండియా-ఇరాన్ జాయింట్ కమిషన్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో కలిసి ఆయన అధ్యక్షత వహించారు.
May 6, 2025, 1:22 PM IST
దేశ రాజధాని డిల్లీ నుండి రైళ్లో బయలుదేరిన కేంద్ర మంత్రి కనిపించకుండా పోయారు. కొద్దిసేపటి తర్వాత ఆయన తీవ్ర గాయలతో దొరికారు. ఇంతకు సదరు కేంద్ర మంత్రికి ఏమయ్యింది?
May 5, 2025, 1:47 PM IST
పహల్గాంలో ఉగ్రవాదులు మత ప్రాతిపదికన టూరిస్ట్ లను కాల్చిచంపడంతో బాధిత హిందు సమాజంలో ఆగ్రహజ్వాలలు రేగాయి. ఈ క్రమంలో తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హిందు జనాభా తగ్గుదలపై సంచలనం వ్యాఖ్యలు చేసారు. ఇంతకూ ఆయన ఏమన్నారంటే...
May 4, 2025, 1:47 PM IST
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరుదేశాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా త్రివిద దళాధిపతులతో భేటీ అవుతున్నారు.
May 2, 2025, 12:30 PM IST
విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధాని మోడీ ప్రారంభించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో కలిసి ఆయన పోర్ట్ ను ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు.
May 2, 2025, 9:31 AM IST
ప్రధాని మోదీ శుక్రవారం అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ, పరిసర ప్రాంతాల్లో ఉదయం నుండి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. వివిధ మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నారు.
May 1, 2025, 8:52 PM IST
పహల్గాం ఉగ్రదాడిపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఎవరినీ వదలమని, ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.
May 1, 2025, 4:26 PM IST
Union Minister Kishan Reddy compares Congress party to a dog: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని కుక్కతో పోల్చారు. కిషన్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
May 1, 2025, 2:00 PM IST
పహల్గాం ఉగ్రదాడి తర్వాత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడారు. దోషులను శిక్షించి తీరుతామని జైశంకర్ స్పష్టం చేశారు.
Apr 30, 2025, 9:14 PM IST
పహల్గాం దాడిలో చనిపోయిన వారికి అమరుల హోదా ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దోషులకు కఠిన శిక్ష పడాలని, ప్రతిపక్షాలు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాయని ఆయన అన్నారు.
Apr 30, 2025, 8:59 PM IST
స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా దేశవ్యాప్త కులగణనకు కేంద్రం ఆమోదం తెలిపింది. జనాభా లెక్కలతోపాటు ఈ గణన జరుగుతుంది. ఈ ఢాటా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలుసా?
Apr 30, 2025, 4:48 PM IST
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణనకు సిద్దమయ్యింది. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఇవాాళ భేటీ అయిన సూపర్ కేబినెట్. ఆ నిర్ణయాలేంటో తెలుసుకుందాం.
Apr 30, 2025, 7:48 AM IST
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రమాదం జరిగింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి గోడకూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తత వాతవరణానికి సంబంధఇంచిన అప్డేట్స్, ఈ రోజు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..