Asianet News TeluguAsianet News Telugu

చరిత్ర సృష్టించిన పీవి సింధు...వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో ఘన విజయం

ప్రపంచ బ్యాడ్మింటన్ విజేతగా తెలుగు తేజం పీవీ. సింధు నిలిచింది. ఫైనల్లో జపాన్ క్రీడాకారిణీ ఒకుహురాను ఓడించింది
 

World Badminton Championships 2019: PV Sindhu beats Nozomi Okuhara
Author
New Delhi, First Published Aug 25, 2019, 6:14 PM IST

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో తెలుగు తేజం తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది.  ఫైనల్లో జపాన్ క్రీడాకారిణీ నొజోమీ ఒకుహురాను ఓడించి విజేతగా నిలిచింది. సింధు 21-7, 21-7 పాయింట్లతోఒకుహురాపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వరుస సెట్లను గెలుచుకుని విజయాన్ని అందుకుంది. కేవలం 36 నిమిషాల్లోనే సింధు విజయయాత్ర ముగియడం విశేషం. 

ఈ మ్యాచ్ ఆరంభంనుండి సింధు దూకుడుగా ఆడుతూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దీంతో మొదటి రౌండ్ ను 21-7 పాయింట్ల తేడాతో గెలుచుకుంది. రెండో రౌండ్లో కూడా ఏ మాత్రం దూకుడు తగ్గించని సింధు సేమ్ ఫలితాన్ని రాబట్టింది. దీంతో 21-7, 217 తేడాతో ఓడించి మొదటిసారి వరల్డ్ ఛాంపియన్ షిప్ ను చేజిక్కించుకుంది. 

ప్రస్తుతం వరల్డ్ ర్యాకింగ్స్ లో ఐదో స్థానంలో నిలిచిన సింధు వరల్డ్ ఛాపింయన్ గా నిలిచింది. ఇలా మొదటిసారి ఈ టోర్నమైంట్ లో  గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది.  

ఈ విజయం అనంతరం సింధు మీడియాతో తన ఆనందాన్ని పంచుకుంది. ''ఈ మెడల్ ను మా అమ్మకు అంకితమిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఆమె పుట్టినరోజు.  తన విజయం ఆమెనెంతో ఆనందించేలా చేసింది. కాబట్టి పుట్టినరోజు గిప్ట్ గా ఈ మెడల్ ను అంకితమిస్తున్నా.'' అని సింధు వెల్లడించింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios