Asianet News TeluguAsianet News Telugu

వింబుల్డన్‌లో సానియా మీర్జాకి షాక్... రెండో రౌండ్ నుంచి ఇంటిదారి...

రష్యన్ జోడి ఎలెనా వెస్నీనా- వెనోరికా కుదెర్‌మోతేవాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిన సానియా మీర్జా జోడి...

మిక్స్‌డ్ డబుల్స్‌ రెండో రౌండ్‌లో రోహన్ బోప్పన్నతో కలిసి రెండో రౌండ్‌కి...

Wimbledon 2021: Sania Mirza out of Womens double event from Second Round CRA
Author
India, First Published Jul 4, 2021, 12:09 PM IST

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకి వింబుల్డన్‌లో షాక్ తగిలింది. సానియా, ఆమె డబుల్స్ పార్టనర్ బెతనీ మటెక్‌సాండ్స్, రెండో రౌండ్‌లో రష్యన్ జోడి ఎలెనా వెస్నీనా- వెనోరికా కుదెర్‌మోతేవాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయారు.

తొలి సెట్‌ను 4-6 తేడాతో కోల్పోయిన సానియా జోడీ, రెండో సెట్‌ను 3-6 తేడాతో చేజార్చుకుంది. మొదటి రౌండ్‌లో ఆరో సీడ్స్ అలెక్సా గురాచీ- డిసైరీ క్రాజిక్‌లను ఓడించిన సానియా- బెతనీ జోడీ రెండో రౌండ్‌లోకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే.

నేటి సాయంత్రం మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నతో కలిసి రెండో రౌండ్‌లో పాల్గనబోతోంది సానియా మీర్జా. ఈ జోడీ బ్రిటీష్ డబుల్స్ జోడీ ఐడన్ మెక్‌హెగ్- ఎమిలీ వెబ్లేస్మిత్‌తో రెండో రౌండ్‌లో తలబడబోతున్నారు.

తొలి రౌండ్‌లో సానియా- బోపన్న జోడి, మరో భారత జోడి అయిన అకింతా రైనా- రామ్‌కుమార్ రామనాథమ్‌లను ఓడించి రెండో రౌండ్‌కి అర్హత సాధించడం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios