భారత్-పాక్ మ్యాచ్ వివాదంపై స్పందించిన కోహ్లీ... (వీడియో)
పుల్వామా దాడి నేపథ్యంలో భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఈ ప్రభావం ఇరుదేశాల క్రికెట్ వ్యవహారాలపైనే కాదు ఐసిసి నిర్వహించే అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ పై పడింది. ప్రస్తుతం ఈ మెగా టోర్నీలో అత్యంత ఆదరణ కలిగిన భారత్-పాక్ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. పాక్ తో మ్యాచ్ ను భారత్ బహిష్కరించాలని మాజీలు, అభిమానులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు.
పుల్వామా దాడి నేపథ్యంలో భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఈ ప్రభావం ఇరుదేశాల క్రికెట్ వ్యవహారాలపైనే కాదు ఐసిసి నిర్వహించే అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ పై పడింది. ప్రస్తుతం ఈ మెగా టోర్నీలో అత్యంత ఆదరణ కలిగిన భారత్-పాక్ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. పాక్ తో మ్యాచ్ ను భారత్ బహిష్కరించాలని మాజీలు, అభిమానులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు.
విశాఖ పట్నంలో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సీరీస్ ప్రారంభకానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే టీంఇండియా ఆటగాళ్లంతా వైజాగ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20, వన్డే సీరిస్ ల గురించి మాట్లాడారు. అనంతరం పుల్వామా దాడి, ప్రపంచ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ గురించి కూడా కోహ్లీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
పుల్వామాలో భారత సైనికులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించాడు. ప్రపంచ కప్ టోర్నీలో పాక్ తో మ్యాచ్ ఆడకూడదంటూ వస్తున్న డిమాండ్ పై కేంద్ర ప్రభుత్వం, బిసిసిఐ నిర్ణయం తీసుకుంటాయని కోహ్లీ తెలిపాడు. వారి ఆదేశాలను తాము శిరసావహిస్తామని పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి భారత జట్టు మొత్తం కట్టుబడి వుంటుందని కోహ్లీ వెల్లడించారు.
వీడియో
#WATCH Virat Kohli on Ind Vs Pak in World Cup says, "Our sincere condolences to the families of CRPF soldiers who lost their lives in #PulwamaAttack. We stand by what the nation wants to do and what the BCCI decides to do." pic.twitter.com/gjyJ9qDxts
— ANI (@ANI) February 23, 2019