Asianet News TeluguAsianet News Telugu

క్రీడారంగంపై నిర్మలమ్మ కరుణ.. పెరిగిన స్పోర్ట్స్ బడ్జెట్

Union Budget 2023: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  నేడు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.  క్రీడారంగానికి గతేడాదితో పోల్చితే కేటాయింపులను  పెంచారు. ఈ ఏడాది ఆసియా క్రీడలు ఉండటంతో  కేటాయింపులు భారీగా పెరిగాయి. 

Sports Sector Gets Huge Boost, Finance Ministry Allocates Rs. 3397 Crores  MSV
Author
First Published Feb 1, 2023, 4:17 PM IST

దేశ క్రీడారంగానికి  నిర్మలమ్మ తన బడ్జెట్ లో శుభవార్త అందించారు. నేడు లోక్‌సభలో ఆమె ప్రవేశపెట్టిన  కేంద్ర బడ్జెట్ -2023 లో భాగంగా క్రీడా రంగానికి కేటాయింపులను భారీగా పెంచారు.  2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను క్రీడా బడ్జెట్ ను రూ. 3,397.32 కోట్లుగా  ప్రకటించారు. గతేడాదితో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 334.72 కోట్ల కేటాయింపులు పెరిగాయి.  ఈ ఏడాది  ఆసియా  గేమ్స్ తో పాటు వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ ఉన్న  నేపథ్యంలో ఈ కేటాయింపులు   క్రీడాకారులకు   మేలుచేసేవే. కాగా, ఇప్పటివరకు  క్రీడారంగానికి ఇంత  బడ్జెట్ కేటాయించడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. 

2022-23 బడ్జెట్ లో క్రీడారంగానికి రూ.  3,062.60 కోట్లు  కేటాయింపులు చేశారు.   అయితే ఈ ఏడాది ఆసియా గేమ్స్ తో పాటు  వచ్చే ఏడాది  పారిస్  వేదికగా జరుగబోయే  ఒలింపిక్స్ కు సన్నద్ధమవుతున్న క్రీడాకారులకు  సౌకర్యాలు మరింత మెరుగుపరిచేందుకు బడ్జెట్ లో కేటాయింపులు పెరిగాయి. 

బడ్జెట్ లో ఎవరెవరికి ఎంతెంత..? 

- ఖేలో ఇండియా కు : రూ. 1,045 కోట్లు 
- స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) : రూ. 785.52 కోట్లు
- నేషనల్  స్పోర్ట్స్ ఫెడరేషన్ : రూ. 325 కోట్లు
- నేషనల్ సర్వీస్ స్కీమ్ : రూ. 325 కోట్లు 
- నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ : రూ. 15 కోట్లు 

 

దేశంలో   క్రీడాభివృద్ధిలో భాగంగా  క్రీడాకారులకు జాతీయ క్యాంపుల నిర్వహణ, శిక్షణ, అధునాతన క్రీడా సామాగ్రి కొనుగోలు, మౌలిక వసతుల కల్పన వంటి  సదుపాయాల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు.  పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు  పెంచుకోవాలని చూస్తున్న భారత్.. ఆ దిశగా క్రీడాకారులకు శిక్షణ ఇప్పిస్తున్నది.  

 

Follow Us:
Download App:
  • android
  • ios