నా గురువులు మా తల్లిదండ్రులే... సింధు
తాను ఈ స్థాయిలో ఉండటానికి కారకులు తల్లిదండ్రులు, గురువులే అని సింధు అన్నారు.
తన తల్లిదండ్రులే తన మొదటి గురువులని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీసింధు తెలిపారు. గుంటూరు జిల్లాలో టీచర్స్ డే సందర్భంగా గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సందర్భంగా మాట్లాడుతూ రాష్టానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేందుకు కష్టపడతానని తెలిపారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారకులు తల్లిదండ్రులు, గురువులే అని సింధు అన్నారు.