Asianet News TeluguAsianet News Telugu

ప్రో కబడ్డి 2019: చెలరేగిన వికాస్, ప్రశాంత్...గుజరాత్ పై హర్యానా ఘనవిజయం

దేశ రాజధాని న్యూడిల్లీ వేదికన జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 7లో హర్యానా జట్టు అదరగొట్టింది. గుజరాత్ జట్టును మట్టికరిపించి ఏకంగా 16 పాయింట్ల తేేడాతో ఘన విజయం సాధించింది.  

pro kabaddi 2019: haryana steelers grand victory against gujrat
Author
New Delhi, First Published Aug 28, 2019, 8:50 PM IST

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 7 హర్యానా స్టీలర్ మరో విజయాన్ని అందుకుంది. గుజరాత్ ఫార్చూన్ సూపర్ జాయింట్స్ తో జరిగిన మ్యాచ్ హర్యానా రైడర్స్, డిఫెండర్స్ అదరగొట్టారు. దీంతో ఏకంగా 16పాయింట్ల తేడాతో గుజరాత్  చిత్తుగా ఓడిపోయింది. ఈ విజయంతో హర్యానా పాయింట్స్ పట్టికలో ముందుకు దూసుకుపోయింది. 

దేశ రాజధాని న్యూడిల్లీలోని త్యాగరాజ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ రసవత్తర పోరుకు వేదికయ్యింది. హర్యానా జట్టు ఆటగాళ్లు సమిష్టిగా రాణించి చివరకు విజయాన్ని అందుకున్నారు. ఆటగాళ్లలో వికాస్ 8, ప్రశాంత్ 8, వినయ్ 7 పాయింట్లతో ఆకట్టుకున్నారు. మిగతావారిలో రవి కుమార్ 6, వికాస్ 3 పాయింట్లతో పరవాలేదనిపించారు. దీంతో హర్యానా జట్టు భారీ పాయింట్లు సాధించి విజయాన్ని అందుకుంది. 

మొత్తంగా హర్యానా రైడింగ్ లో 22, ట్యాకిల్స్ లో 14, ఆలౌట్ల ద్వారా 6, ఎక్స్‌ట్రాల రూపంలో 1 పాయింట్  సాధించింది. ఇలా మ్యాచ్ ముగిసేసరికి  41 పాయింట్లతో గుజరాత్ పై తిరుగులేని ఆధిక్యంలో నిలిచి గెలుపును సొంతం చేసుకుంది. 

ఇక గుజరాత్ విషయానికి వస్తే రైడింగ్ లో 16 పాయింట్లతో ఫరవాలేదనిపించినా ట్యాకిల్స్ లో కేవలం 8 పాయింట్స్ మాత్రమే సాధించింది. మరో పాయింట్  ఎక్స్‌ట్రా రూపంలో రావడంతో మొత్తం 25 పాయింట్లకు చేరుకుంది. అయినప్పటికి హర్యానా  కంటే ఇంకా 16 పాయింట్లు వెనుకబడి ఘోర ఓటమిని చవిచూసింది.

గుజరాత్ ఆటగాళ్లలో ఏ ఒక్కరు మెరుగ్గా రాణించి భారీ పాయింట్లు రాబట్టలేకపోయారు. అబూ ఫజల్ 4, మోరే 4, రోహిత్ 4 పాయింట్లతో ఆ జట్టులో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక  వినోద్ 3,  రుతురాజ్ 2, లలిత్ 2, సుమిత్ 2 పాయింట్లు సాధించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా 25-41 తేడాతో గుజరాత్ పై హర్యానా ఘనవిజయం సాధించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios