పెర్త్ టెస్ట్: ముగిసిన ఆట, 175 పరుగుల ఆధిక్యంలో ఆసీస్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్లో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో మూడవ రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్లో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో మూడవ రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు.
ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన ఓపెనర్లు మార్కస్ హారిస్, అరోన్ ఫించ్ గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని బుమ్రా విడగొట్టాడు. 17.2 ఓవర్ వద్ద బుమ్రా బౌలింగ్లో హారీస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత గాయం కారణంగా ఫించ్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే షాన్ మార్ష్ను షమీ వెనక్కి పంపాడు. ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు ప్రయత్నించిన హ్యాండ్స్కాంబ్, ఉస్మాన్ ఖవాజాల జోడీని ఇషాంత్ విడదీశాడు.
శర్మ బౌలింగ్లో కాంబ్ ఎల్బీగా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ట్రేవిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజాలు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. నాలుగో వికెట్కు 35 పరుగులు జోడించిన తర్వాత షమీ బౌలింగ్లో ట్రేవిస్ హెడ్ పెవిలియన్కు చేరాడు.
ప్రస్తుతం ఆసీస్ 48 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కెప్టెన్ టీమ్ పెయిన్ 8, ఉస్మాన్ ఖవాజా 41 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు మందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 283 పరుగులకు అలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్ 175 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.