Asianet News TeluguAsianet News Telugu

టెన్నిస్ స్టార్ జకోవిచ్ కు కరోనా

టెన్నిస్ సూపర్ స్టార్ జకోవిచ్ కరోనా వైరస్ బారినపడ్డాడు. ఈ విషయం స్వయంగా జకోవిచ్ వెల్లడించాడు. ఏడ్రియా టూర్ పూర్తిచేసుకొని క్రొయేషియా నుంచి బెల్గ్రేడ్ తిరిగి వెళ్ళాక చేపించుకున్న టెస్టుల్లో అతనికి పాజిటివ్ అని తేలింది.

Novak Djokovic tests positive for coronavirus
Author
Hyderabad, First Published Jun 23, 2020, 6:00 PM IST

టెన్నిస్ సూపర్ స్టార్ జకోవిచ్ కరోనా వైరస్ బారినపడ్డాడు. ఈ విషయం స్వయంగా జకోవిచ్ వెల్లడించాడు. ఏడ్రియా టూర్ పూర్తిచేసుకొని క్రొయేషియా నుంచి బెల్గ్రేడ్ తిరిగి వెళ్ళాక చేపించుకున్న టెస్టుల్లో అతనికి పాజిటివ్ అని తేలింది. అదే టూర్ లో ఇప్పటికే ముగ్గురు ప్లేయర్స్ కరోనా వైరస్ పాజిటివ్ గా తేలడంతో జకోవిచ్ టెస్ట్ చేపించుకున్నాడు. 

చారిటీ కోసం నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్ మ్యాచులను వివిధ దేశాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో స్టార్ ప్లేయర్ జకోవిచ్ పాల్గొంటుండడంతో... దానికి బాగా క్రేజ్ వచ్చింది. కొన్ని రోజుల కింద  సెర్బియాలో ప్రారంభమైన ఈ క్రీడలు అక్కడి నుంచి ఇప్పుడు క్రొయేషియా వేదికగా జరుగుతున్నాయి. 

ఇకపోతే.... క్రికెట్ ఆటపై కూడా కరోనా వైరస్ పంజా విసురుతోంది. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ టీంలోని ముగ్గురి క్రికెటర్లకు ఒకేరోజు కరోనా సోకింది. హైదర్ అలీ, షాదాబ్ ఖాన్, హారిస్ రవుఫ్ కరోనా బారిన పడ్డారు. ఇంగ్లాండ్ టూర్ కి వెళ్లే ముందు రావల్పిండిలో జరిపిన స్క్రీనింగులో వీరికి కరోనా వైరస్ ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. వీరికి స్క్రీనింగ్ కి ముందు వరకు, ఫలితాలు వచ్చాక కూడా లక్షణాలు లేవని, వీరందరిని హోమ్ క్వారంటైన్ లో ఉండమని ఆదేశాలిచ్చినట్టుగా తెలిపారు. 

ఈ నెల 28వ తేదీన పాకిస్తాన్ జట్టు మూడు టెస్టులు, మూడు టి20లు ఆడటానికి ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లనుంది. వకార్ యూనుస్, షోయబ్ మాలిక్ ల టెస్టు ఫలితారు నేడు మధ్యాహ్నం కల్లా రానున్నాయని తెలియవస్తుంది. 

పాకిస్తాన్ క్రికెటర్లకు కరోనా సోకడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని అన్నారు. అంతర్ కాకుండా అందరూ ప్లేయర్స్ కూడా వేర్వేరుగా ప్రాక్టీస్ చేయడం వల్ల వైరస్ అందరికి సోకె ఆస్కారం తక్కువగా ఉందని టీం మానేజ్మెంట్ అభిప్రాయపడింది. 

ఇంగ్లాండ్ లో కూడా సిరీస్ ఆగస్టులో ప్రారంభమవనుంది. సిరీస్ కి దాదాపుగా అయిదు  వెళ్తున్నందున, అక్కడ కూడా బయో సెక్యూర్ బబూల్ వాతావరణంలో ఆడుతున్నందున పెద్ద ఇబంది లేదని అంటున్నారు. 

ఇప్పటికే హారిస్ సోహైల్, అమిర్ సోహైల్ ఇంగ్లాండ్ టూర్ లో ఆడమని చెప్పిన నేపథ్యంలో... ఇప్పుడు మరో ముగ్గురు కూడా కరోనా పాజిటివ్ గా తేలడంతో పాకిస్తాన్ టీం అవకాశాలు దెబ్బతినే ఆస్కారం లేకపోలేదు. 

పాకిస్తాన్ జట్టు మాత్రం ఇప్పుడు కరోనా పాజిటివ్ గా తేలినవారు మ్యాచ్ సమయానికి  కోలుకుంటారని,వారు ఆడే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios