INDIA PAKISTAN WAR: భారత్ సైన్యానికి నీరజ్ మద్దతు

Synopsis
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత సైన్యానికి ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మద్దతు ప్రకటించారు.
న్యూ ఢిల్లీ: భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత సైన్యానికి నీరజ్ చోప్రా తన మద్దతును ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న సైన్యం ధైర్యసాహసాలను, కృషిని ఆయన ప్రశంసించారు.రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా, తన అధికారిక X హ్యాండిల్ ద్వారా సైన్యానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సున్నిత సమయంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
"ఉగ్రవాదంపై పోరాడుతున్న మన ధైర్యవంతులైన భారత సైన్యం గురించి మనం గర్వపడుతున్నాం. ఈ సమయంలో అందరి భద్రతను నిర్ధారించడానికి మార్గదర్శకాలను పాటించాలి. జై హింద్ జై భారత్ జై హింద్ కీ సేన" అని చోప్రా రాసుకొచ్చారు.
We are proud of our Brave Indian Armed Forces who are fighting for our nation against Terrorism.
Let’s do our part and make sure to follow guidelines to ensure everyone’s safety during this time.
जय हिन्द जय भारत जय हिन्द की सेना 🇮🇳— Neeraj Chopra (@Neeraj_chopra1) May 8, 2025
.