Asianet News TeluguAsianet News Telugu

కామన్వెల్త్ గేమ్స్ 2022: లక్ష్యాని ఛేదించిన లక్ష్యసేన్‌... ఆఖరి రోజు భారత్‌కి రెండో స్వర్ణం...

కామన్వెల్త్ గేమ్స్ 2022లో 20కి చేరిన భారత స్వర్ణాల సంఖ్య... బ్యాడ్మింటన్ పురుషుల ఫైనల్స్‌లో లక్ష్యసేన్‌కి గోల్డ్ మెడల్..

Lakshya Sen won the gold for India in Commonwealth Games 2022, badminton
Author
India, First Published Aug 8, 2022, 4:47 PM IST

కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆఖరి రోజు భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. మహిళల సింగిల్స్ ఫైనల్‌లో  తెలుగు తేజం పీవీ సింధు విజయం సాధించి, భారత స్వర్ణాల సంఖ్యను 19కి చేరిస్తే లక్ష్యసేన్ దాన్ని 20కి పెంచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో వరల్డ్ నెంబర్ 42వ ర్యాంకర్, మలేషియా షట్లర్‌ టీ యంగ్ ఎన్‌జీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 19-21, 21-9, 21-16 తేడాతో వరుస విజయం అందుకున్నాడు లక్ష్యసేన్...

లక్ష్యసేన్‌కి ఇదే మొట్టమొదటి కామన్వెల్త్ మెడల్. తొలి సెట్‌ని 19-21 తేడాతో పోరాడి ఓడిన లక్ష్యసేన్, ఆ తర్వాత అదిరిపోయే ఆటతీరుతో కమ్‌బ్యాక్ ఇచ్చి వరుస సెట్లలో మలేషియా షెట్లర్‌ని చిత్తు చేశాడు. లక్షసేన్ దూకుడుకి  టీ యంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయాడు. లక్ష్యసేన్ విజయంతో భారత్ ఖాతాలో 20 స్వర్ణాలు చేరాయి. తన విజయంతో భారత్‌కి నాలుగో స్థానాన్ని కన్పార్మ్ చేశాడు లక్ష్యసేన్...

20 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్య పతకాలతో ప్రస్తుతం భారత జట్టు ఖాతాలో 57 పతకాలు ఉన్నాయి. ఐదో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ 19 స్వర్ణాలు, 12 రజతాలు, 17 కాంస్యాలతో 48 పతకాలు ఉన్నాయి. న్యూజిలాండ్ మరో గోల్డ్ ఈవెంట్‌లో పాల్గొనబోతుంటే భారత జట్టు మరో మూడు గోల్డ్ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉంది. ఆ స్వర్ణాలు రాకపోయినా, న్యూజిలాండ్ స్వర్ణం గెలిచినా భారత్‌ ఖాతాలో ఎక్కువ రజతాలు ఉన్నందున 4వ స్థానంలో కొనసాగుతుంది.

అంతకుముందు బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు, తన ప్రత్యర్థి కెనడాకి చెందిన మిచెల్ లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-15, 21-13 తేడాతో వరుస సెట్లలో విజయం అందుకుని మ్యాచ్‌ని సునాయాసంగా ముగించింది... 

మొదటి గేమ్‌ని 21-15 తేడాతో గెలిచిన పీవీ సింధు, రెండో గేమ్‌లోనూ అదే దూకుడు చూపించింది. 21-13 తేడాతో రెండో గేమ్‌ని మ్యాచ్‌ని ముగించేసింది. వరల్డ్ నెం. 13 ర్యాంకర్ మిచెల్ లీని గత ఆరు మ్యాచుల్లో ఓడించిన పీవీ సింధు, అదే దూకుడుని కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్‌లోనూ చూపించింది.

2014 కామన్వెల్త్ గేమ్స్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మిచెల్ లీ చేతుల్లో పరాజయం పాలైన పీవీ సింధు, ఆ ఏడిషన్‌లో కాంస్య పతకం గెలిచి సరిపెట్టుకుంది.  2014 గాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో వుమెన్స్ సింగిల్స్‌లో కాంస్యం, 2018 గోల్డ్ కోస్ట్‌లో రజతం గెలిచిన పీవీ సింధుకి సింగిల్స్‌లో ఇదే మొట్టమొదటి కామన్వెల్త్ స్వర్ణం. 2018 మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన పీవీ సింధు, ఈసారి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రజతం గెలిచింది. మొత్తంగా కామన్వెల్త్‌ గేమ్స్‌లో పీవీ సింధుకి ఇది ఆరో మెడ్. ఇందులో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్య పతకం ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios