విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన ఆమ్లా
ఆమ్లా 120 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్తో 108 పరుగులు చేసి కెరీర్లో 27వ సెంచరీ నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ 169వ ఇన్నింగ్స్లో 27వ సెంచరీ నమోదు చేశాడు. అయితే ఆమ్లా 167 ఇన్నింగ్స్లలోనే ఆ ఘనత సాధించాడు.
పోర్ట్ ఎలిజిబెత్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హషీం ఆమ్లా బద్దలుగొట్టాడు. పాకిస్థాన్తో శనివారం జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసిన ఆమ్లా వన్డేల్లో అత్యంత వేగంగా 27 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్లో ఆమ్లా 120 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్తో 108 పరుగులు చేసి కెరీర్లో 27వ సెంచరీ నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ 169వ ఇన్నింగ్స్లో 27వ సెంచరీ నమోదు చేశాడు. అయితే ఆమ్లా 167 ఇన్నింగ్స్లలోనే ఆ ఘనత సాధించాడు.
2017 జనవరి 15వ తేదీన పుణే వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన వన్డేలో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.ఫామ్ కోల్పోయి గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఆమ్లా 15 నెలల తర్వాత సెంచరీ సాధించి కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.