Asianet News TeluguAsianet News Telugu

PV Sindhu: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ క్వార్టర్స్ లోకి ప్రవేశించిన పీవీ సింధు..

French Open World Tour: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750  బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది.పురుషుల  డబుల్స్ విభాగంలో  సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీ క్వార్టర్స్ కు చేరుకున్నారు.

French Open World Tour: Indian Star Shuttler PV Sindhu enters Quarter finals and satwiksairaj chirah shetty pair reach the same
Author
Hyderabad, First Published Oct 29, 2021, 1:30 PM IST

పారిస్ లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ (French Open World Tour) సూపర్-750  బ్యాడ్మింటన్ (Badminton)టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ విభాగంలో పోటీ పడుతున్న ఆమె.. గురువారం జరిగిన ప్రి క్వార్టర్స్ లో.. 21-19, 21-9 తో డెన్మార్క్ కు చెందిన క్రిస్టోఫర్సెన్ (Line Christophersen) పై  విజయం సాధించింది. ఇక పురుషుల  డబుల్స్ విభాగంలో  సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీ.. 15-21, 21-10, 21-19 తేడాతో మరో భారత జోడీ అర్జున్-ధ్రువ్ లను ఓడించి క్వార్టర్స్ కు చేరుకున్నారు. 

మహిళల సింగిల్స్ లో నాలుగో సీడ్ సింధు.. గురువారం జరిగిన  పోరులో తొలి గేమ్ లో తడబడింది. ముందు 0-5తో వెనుకంజలో ఉన్న ఆమె.. తర్వాత పుంజుకుని ఆ సెట్ ను 21-19తో గెలుచుకుంది. ఇక రెండో గేమ్  లో సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రౌండ్ లో పోరాడిన క్రిస్టోఫర్సెన్.. రెండో రౌండ్ లో చేతులెత్తిసింది. దీంతో ఈ సెట్ ను సింధు 21-9 తో అలవోకగా నెగ్గింది. 

 

ఇదిలాఉండగా.. క్వార్టర్స్ లో సింధు.. బుసానన్ ను ఢీకొనబోతుంది. డెన్మార్క్ కే చెందిన బుసానన్.. వారం రోజుల క్రితం జరిగిన డెన్మార్క్ ఓపెన్ లో సింధు చేతిలో పరాజయం పాలైంది.  ఆ ఓటమికి బుసానన్.. బదులు తీర్చుకోవాలని చూస్తుండటంతో ఈ పోరు ఆసక్తికరంగా మారనుంది. 

ఇక పురుషుల  డబుల్స్ లో  సాయిరాజ్-చిరాగ్ శెట్టి లు వచ్చే సోమవారం ఆరోన్ చియ-సో వూయ్ యిక్ (మలేషియా) లతో క్వార్టర్స్  పోరులో తలపడనున్నారు. పురుషుల సింగిల్స్ లో సౌరభ్ వర్మ పోరాటం ముగిసింది. రెండో రౌండ్ లో అతడు.. జపాన్ కు చెందిన కెంటా నిషిమొటొ చేతిలో 21-12, 21-9 తేడాతో ఓటమి పాలయ్యాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios