Asianet News TeluguAsianet News Telugu

స్వర్ణమే కాదు, మనసులు కూడా గెలిచిన నీరజ్ చోప్రా..!

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. 
 

Neeraj Chopra's Gesture For Pakistan's Arshad Nadeem After Javelin Throw Final Wins Hearts ram
Author
First Published Aug 28, 2023, 11:03 AM IST

నీరజ్ చోప్రా పరిచయం అవసరం లేని పేరు.  ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు. హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం అందించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. 

అయితే, స్వర్ణం మాత్రమే కాదు, నీరజ్ తన ప్రవర్తనతలో ఎంతో మంది మనసులు కూడా గెలుచుకున్నాడు.ఈ హోరులో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే. సెకండ్ స్టానంలో పాకిస్థాన్ కి చెందిన అర్షద్ నదీమ నిలిచారు. అర్షద్ నదీమ్ 87.82 మీటర్ల దూరంతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్ తర్వాత, ఇద్దరు అథ్లెట్లు మైదానంలో ఒక తేలికపాటి క్షణాన్ని పంచుకున్నారు, అది సోషల్ మీడియాలో అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

 

నీరజ్, నదీమ్ చాలా కాలంగా మైదానంలో ఒకరినొకరితో పరిచయం ఉంది. వారి బంధం ట్రాక్‌కు మించి ఉంది. ఇద్దరు ఏస్ అథ్లెట్లు అనేక సందర్భాల్లో ఒకరితో ఒకరు పోడియం స్పాట్‌లను పంచుకోవడం విశేషం.

కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతక విజేతగా నిలిచిన పాకిస్థాన్‌కు చెందిన నదీమ్ మరోసారి 90 మీటర్ల మార్కును దాటాలని చూస్తున్నాడు. బుడాపెస్ట్‌లో పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ ముగిసిన తర్వాత, నీరజ్ మైదానంలో ఒక ఫోట కోసం కోసం నదీమ్‌ను ఆహ్వానించాడు.

నదీమ్ వెంటనే నీరజ్ వైపు పరుగెత్తాడు, అతని పక్కన నిలబడి 86.67 మీటర్ల త్రోతో కాంస్య పతకాన్ని సాధించిన చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్ కూడా నిలబడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. పక్క దేశం వ్యక్తితో అందులోనూ ఒకే మ్యాచ్ కోసం పోటీ పడే వ్యక్తితో నీరజ్ అంత స్నేహంగా ప్రవర్తించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios