Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీకి అమెరికా రెడ్ కార్పెట్.. రాహుల్ భారత వ్యతిరేక ప్రచారానికి చెంపదెబ్బ..

భారత జాతీయ కాంగ్రెస్, ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీతో కూడిన రాజవంశ రాజకీయాలను భారతదేశ ప్రజలు తిరస్కరించినప్పటీ నుంచి.. లభించిన ప్రతి అవకాశంలోనూ భారత ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాకుండా భారతదేశం పేరును చెడగొట్టేందుకు సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేసే రాజకీయ సమూహం పెరిగింది.

US is rolling out a red carpet for Modi Congress going green with envy ksm
Author
First Published Jun 12, 2023, 3:15 PM IST

భారత జాతీయ కాంగ్రెస్, ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీతో కూడిన రాజవంశ రాజకీయాలను భారతదేశ ప్రజలు తిరస్కరించినప్పటీ నుంచి.. లభించిన ప్రతి అవకాశంలోనూ భారత ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాకుండా భారతదేశం పేరును చెడగొట్టేందుకు సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేసే రాజకీయ సమూహం పెరిగింది. భారతదేశంలో దోపిడీ వ్యవస్థను స్థాపించాలనుకునే అంతర్జాతీయ సంస్థలు సాధారణంగా ఇటువంటి ప్రచారాలకు ఆజ్యం పోయడం సహజం. వీటిని జార్జ్ సోరోస్ వంటి వ్యక్తులు స్పాన్సర్ చేస్తారు. అలాంటి వారి మద్దతు ఉన్న టూల్‌కిట్ గ్యాంగ్‌లు ప్రతిరోజూ ప్రచారం చేస్తాయి.

భారతదేశంలో ప్రజాస్వామ్యం ముగిసింది, రాజ్యాంగ సంస్థలు కనుమరుగవుతున్నాయి, మీడియా స్వేచ్ఛ హరించబడింది, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక, శాసనవ్యవస్థ స్తంభించిపోయాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) ద్వారా ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారు, ఎన్నికల సంఘం పక్షపాతంతో ఎన్నికలను నిర్వహిస్తోంది, భారతదేశం క్రోనీ క్యాపిటలిజానికి ఆటస్థలంగా మారింది.. ఇలాంటి అనంతమైన కల్పిత, ఊహాజనిత ఆరోపణలను ప్రచారం చేస్తుంటారు. 

కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. అతను బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ)లను ప్రజాస్వామ్యానికి సంరక్షకులుగా అభివర్ణించారు. భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం వారి జోక్యాన్ని మరింత కోరారు. తన ఇటీవలి యూఎస్‌ఏ పర్యటనలో.. భారతదేశానికి, భారతీయతకు వ్యతిరేకంగా ప్రచారాన్ని వేగవంతం చేయడానికి అతను మరోసారి తన బెస్ట్ లెవల్‌లో ప్రయత్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ ద్వారా భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఫాసిస్ట్‌లు వివిధ ప్రజాస్వామ్య, రాజ్యాంగ సంస్థలపై కూర్చున్నారని.. ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రతిరోజూ ఖూనీ చేయబడుతుందని ఆరోపణలు గుప్పించారు. రాహుల్ గాంధీ చేసిన ప్రకటనలు ఇప్పటికీ ముఖ్యాంశాలలో ఉన్నాయి. వారి మునుపటి పద్ధతులకు అలవాటుపడిన పాకిస్తాన్ లాబీ యూఎస్‌ఏ భారత వ్యతిరేక ప్రచారాలను ప్రారంభించింది.

 ఐక్యరాజ్యసమితి (యూఎన్)లో భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి రాహుల్ గాంధీ చేసిన భారత వ్యతిరేక ప్రకటనలను కూడా పాకిస్తాన్ ఉటంకించింది/ఉపయోగించింది. రాహుల్ గాంధీ ప్రకటనల సందర్భంలో సహజంగానే.. మరోసారి పాకిస్థానీ సంతతికి చెందిన అమెరికన్ జర్నలిస్ట్ అస్మా ఖలీద్ భారతదేశంలో ప్రజాస్వామ్యం క్షీణించడంపై అమెరికా అధికారులను ప్రశ్నించారు.  ఆమె అటువంటి ప్రశ్న అడగడం యొక్క లక్ష్యం స్పష్టంగా ఉంది. అధికారి రాహుల్ గాంధీ ఆరోపణలను ముఖ విలువగా తీసుకుంటే, ఆయన భారతదేశానికి వ్యతిరేకం అని ఒక ప్రకటన విడుదల చేస్తే.. అది రాబోయే భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనపై కొంత ప్రతికూల ప్రభావం చూపుతుంది.

అయితే వైట్‌హౌస్‌లోని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ ఆమె ఉద్దేశాలను కూల్చివేశారు. ఆయన సమాధానం రాహుల్ గాంధీ భారత వ్యతిరేక ప్రచారానికి చెంపదెబ్బగా భావించవచ్చు. కిర్బీ మాట్లాడుతూ.. ‘‘భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం. మీకు తెలిసిన ఎవరైనా, న్యూఢిల్లీకి వెళ్లినప్పుడు అది స్వయంగా చూడగలరు. ప్రజాస్వామ్య సంస్థల బలం, ఆరోగ్యం చర్చలో భాగమని ఖచ్చితంగా నేను ఆశిస్తున్నాను. చూడండి.. మనం ఎప్పుడూ సిగ్గుపడము. మీరు దీన్ని స్నేహితులతో చేయవచ్చు. మీరు దీన్ని స్నేహితులతో చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరితోనైనా మేము కలిగి ఉండగల ఆందోళనలను వ్యక్తపరచడానికి మీరు ఎప్పుడూ సిగ్గుపడరు. అయితే ఈ (ప్రధాని మోదీ పర్యటన) సందర్శన నిజంగా ఇప్పుడు ఉన్నదానిని ముందుకు తీసుకువెళ్లడం గురించి, భవిష్యత్తులో లోతైన, బలమైన భాగస్వామ్యం, స్నేహం ఉంటుందని మేము ఆశిస్తున్నాము’’ అని పేర్కొన్నారు. 

 
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో వివిధ అంశాలపై చర్చించాలనుకుంటున్నారని జాన్ కిర్బీ చెప్పారు. భారతదేశం,  భారత ప్రధాన మంత్రి పట్ల ఒక్క జాన్ కిర్బీ అభిమానం మాత్రమే కాదు.. ఇలాంటి స్టాండ్‌తో చాలా మంది యూఎస్ఏ అధికారులు ఉన్నారు. వారి సానుకూల ప్రకటనలు సోరోస్ ముఠా యొక్క ఎజెండాను దెబ్బతీస్తాయి.

నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి అమెరికా విదేశాంగ శాఖ కూడా ప్రకటన ఇచ్చింది. ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ మాట్లాడుతూ.. భారత్‌తో భాగస్వామ్యం అమెరికాకు ఉన్న గొప్ప సంబంధాలలో ఒకటని అన్నారు. ఆర్థిక, వాణిజ్యం, భద్రత రంగాల్లో అమెరికా-భారత్ సంబంధాలు మరింత బలపడతాయన్నారు. అలాగే అమెరికా ఎంపీలు కూడా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు, ఆయన ప్రసంగం భారతదేశం భవిష్యత్తు, రెండు దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆయన దృష్టిని వెలుగులోకి తెస్తుందని పేర్కొన్నారు. జూన్ 22న అమెరికా సెనేట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. అలాగే ప్రతినిధుల సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. యూఎస్‌లో విదేశీ అతిథికి ఇచ్చే అతి పెద్ద గౌరవం ఇది.

2014లో అధికారం చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీకి ఇది 6వ అమెరికా పర్యటన. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్, సోకాల్డ్ సెక్యులర్లు ("సెక్యులర్లు") గుజరాత్ అల్లర్లను ఉటంకిస్తూ ప్రధాని మోదీ వీసాను రాకుండా చేసేందుకు కుట్ర పన్నారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్‌తో సహా ఈ "సెక్యులర్" పార్టీలన్నీ నరేంద్ర మోదీకి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన అనుభవం, జ్ఞానం చాలా తక్కువ అని వాదించాయి. అమెరికా వీసా లేకుండా అంతర్జాతీయ వేదికపై మోదీ దేశానికి ఎలా ప్రాతినిధ్యం వహిస్తారని వారు చాలా ఆందోళన చెందారు!!


ఈరోజు మోడీకి అమెరికా రెడ్ కార్పెట్ పరుస్తుంటే.. కాంగ్రెస్, ఆ పార్టీ సహచరులు అసూయతో ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా లేదా డొనాల్డ్ ట్రంప్ లాగానే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా మోడీ అభిమాని. ‘‘నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి. మీరు నాకు నిజమైన సమస్యను కలిగిస్తున్నారు. వచ్చే నెలలో మేము వాషింగ్టన్‌లో మీ కోసం విందు ఏర్పాటు చేస్తాం. దేశంలోని ప్రతి ఒక్కరూ రావాలని అనకుంటున్నారు. టిక్కెట్లు అయిపోయాయి. నేను తమాషా చేస్తున్నానని మీరు అనుకుంటున్నారా? నా బృందాన్ని అడగండి, నేను ఇంతకు ముందెన్నడూ వినని వ్యక్తుల నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సినీ తారల నుంచి బంధువుల వరకు అందరూ నన్ను సంప్రదిస్తున్నారు. మీరు చాలా పాపులర్’’ అని ఇటీవల ఇద్దరు నాయకులు టోక్యోలో కలుసుకున్నప్పుడు బైడెన్ అన్నారు. 

మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో ఒకే వేదికపై ఉన్నందుకు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మోదీ పట్ల బాగా ఉంటారని వారు ఊహించినందున బైడెన్ పదాలు దేశంలో, వెలుపల భారత వ్యతిరేక శిబిరానికి ఎదురుదెబ్బ తగిలేలా చేశాయి. మోడీ కోసం అమెరికా ఎదురుచూస్తున్న వెచ్చదనం కనిపిస్తోంది. సహజంగానే రాహుల్, ఇతరులలో నిరాశ దామాషా ప్రకారం మాత్రమే పెరుగుతుంది.

కానీ మారుతున్న ప్రపంచ క్రమంలో కీలక పాత్ర పోషించగల కొత్త భారతదేశాన్ని ప్రపంచం గుర్తిస్తోంది.

(-ప్రేమ్ శుక్లా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి)

-

Follow Us:
Download App:
  • android
  • ios