Asianet News TeluguAsianet News Telugu

బ్రేకప్ చెప్పిందని... ప్రేమించిన యువతిని కత్తితో పొడిచి చంపిన మాజీ ప్రేమికుడు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమార్తెను తన మాజీ ప్రేమికుడు కత్తితో పొడిచి చంపాడని బాధితురాలి తల్లి ఆరోపించింది.

Woman Stabbed To Death by Ex-Boyfriend In Karnataka
Author
First Published Jan 18, 2023, 8:08 AM IST

కర్ణాటక : కర్ణాటకలో ఓ యువతిని అతి దారుణంగా హత్య చేశారు. దక్షిణ కన్నద్‌లోని ముండూరు ప్రాంతంలో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న 23 ఏళ్ల మహిళను కత్తితో పొడిచి చంపేశారు. ఈ ఘటనలో కర్ణాటక పోలీసులు మంగళవారం ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మృతురాలిని జయశ్రీ (23)గా గుర్తించారు. ఆమె బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ)లో గ్రాడ్యుయేట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమార్తె మృతికి ఉమేషా కారణమంటూ మృతురాలి తల్లి ఆరోపించింది. జయశ్రీ తల్లి గిరిజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జయశ్రీ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ అగంతకుడు వచ్చి ఆమెను కత్తితో పొడిచాడని, వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే జయశ్రీ మృతి చెందింది. అయితే, ఆమె మృతికి ఉమేషా అనే వ్యక్తి కారణం అని మృతురాలి తల్లి గిరిజ అనుమానం వ్యక్తం చేసింది.  అతడి ప్రేమను జయశ్రీ ఒప్పుకోలేదని పోలీసులు తెలిపారు.

దారుణం.. టూవీలర్ తో 71యేళ్ల వృద్ధుడిని ఈడ్చుకెళ్లాడు... ఏమైందంటే..

ఉమేషా అనే వ్యక్తిని జయశ్రీ కొంతకాలంగా ప్రేమిస్తోంది. ఈ క్రమంలో అతడు తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడు. అయితే, ఇటీవల జయశ్రీకి ఉమేషా చెడు ప్రవర్తన గురించి తెలిసింది. దీంతో అతనితో సంబంధాన్ని తెంచుకుందని గిరిజ తన ఫిర్యాదులో పేర్కొంది. పుత్తూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతుంది. 

ఇలాంటి ఘటనే, జవనరి13న తెలంగాణలో వెలుగుచూసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమోన్మాది వేధింపులను తట్టుకోలేక ఓ ఓ బాలిక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. జిబ్లక్ పల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతల కావ్య (16) పదో తరగతి చదువుతోంది. చౌటుప్పల్ లోని ఓ ప్రైవేటు స్కూల్ విద్యార్థిని. కావ్యను ఓ యువకుడు గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఇన్ స్ట్రాగ్రాంలో అదే గ్రామానికి చెందిన మాచర్ల శివమణి అనే అతను వేధించడం మొదలు పెట్టాడు. తనను ప్రేమించాలని మెసేజ్ లు పెట్టేవాడు. వేధింపులకు గురి చేస్తున్నాడు. 

దీనికి ఆమె వ్యతిరేకిస్తూ.. తిరస్కరిస్తూ వచ్చింది. దీంతో ఆ యువకుడు ఆమెను ప్రేమించకపోతే మీ నాన్న, అన్నను చంపేస్తానని, డబ్బులు కూడా కావాలని బెదిరించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు భరించలేక ఆమె తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ విషయాన్ని తన సోదరుడైన నరేష్ కు చెప్పింది. నరేశ్ కూడా అతడిని కోప్పడ్డాడు. తన చెల్లెలికి మళ్లీ మెసేజ్ పెడితే.. తీవ్ర పరిణామాలుంటాయని శివమణిని హెచ్చరించాడు. డిసెంబర్ 31న అర్థరాత్రి ఇదే విషయంలోనరేశ్, శివమణి మధ్య గొడవ జరిగింది. శివమణి ఆ రోజు రాత్రి కావ్యకు కాల్ చేశాడు. మీ అన్నను చంపేస్తానని బెదిరించాడు. దీంతో పురుగులమందు తాగింది. 

ఇది గమనించిన కుటుంబసభ్యులు గమనించి హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించడంతో కోలుకుంది. ఈ నెల 2న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చింది. దీంతో ఈ నెల 2న గ్రామంలో రెండు కుటుంబాల పెద్దమనుషులతో పంచాయతీ పెట్టారు. శివమణిని అతని తల్లిదండ్రులు కావ్య, ఆమె కుటుంబం జోలికి పోకుండా చూసుకోవాలని తెలిపారు. అయినా శివమణి మారలేదు. ఈ మెసేజ్ లతో కావ్య తీవ్రంగా భయపడింది. ఇక శివమణి మారడని.. తనకు వేధింపులు తప్పవని నిర్ణయానికి వచ్చింది. దీంతో బుధవారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెల్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఫ్యాన్ కు చీరతో ఉరేసుకుంది. సాయంత్రం నరేశ్ ఇంటికి వచ్చి చూసేసరికి.. కావ్య ఫ్యాన్ కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios