ఇళ్లంతా దోచేసి...కుటుంబసభ్యులను బంధించి.. వారి ముందే మహిళపై గ్యాంగ్రేప్
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఇంట్లో దోపిడికి వచ్చిన దుండగులు ఇళ్లంతా దోచేసి.. ఆ ఇంట్లోని మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఇంట్లో దోపిడికి వచ్చిన దుండగులు ఇళ్లంతా దోచేసి.. ఆ ఇంట్లోని మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘజియాబాద్ జిల్లాలోని కక్రా జిల్లాలో బుధవారం రాత్రి ఐదుగురు దొంగలు ఓ ఇంట్లోకి ప్రవేశించారు.
కుటుంబసభ్యులను మారణాయుధాలతో బెదిరించి అందరిని తాళ్లతో కట్టేశారు. అనంతరం ఇంట్లోని నగదు, విలువైన వస్తువులను దోచేశారు. దొంగతనం ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. వారిలోని ఇద్దరి కన్ను ఓ మహిళపై పడింది.
కుటుంబసభ్యుల కళ్ల ముందే ఆమెపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించి.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.