భర్త పోయాక మరో వ్యక్తితో అక్రమ సంబంధం.. ఆస్తి కోసం..
ఆమెకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. అతనితోనే ఉంటుంది. ఈ క్రమంలో.. భర్త ఆస్తి దక్కించుకోవాలని అనుకుంది. మామ నుంచి ఎలాగైనా ఆస్తి కొట్టేయాలని ప్లాన్ వేసింది.
ఆమెకు ఏడేళ్ల క్రితమే వివాహమైంది. అనుకోకుండా మూడేళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. దీంతో.. అప్పటి నుంచి ఒంటరిగా పిల్లలతో కలిసి జీవిస్తోంది. అయితే.. ఆమె జీవితంలోకి మరో వ్యక్తి రావడంతో.. అక్రమ సంబంధం ఏర్పడింది. అతనితో ఊంటూ.. చనిపోయిన భర్త ఆసక్తి దక్కించుకోవాలని అనుకుంది. దాని కోసం.. ప్రియుడితో కలిసి మామను హత్య చేయించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మావనా పోలీస్ స్టేషన్ పరిధిలోని తాటిన గ్రామానికి చెందిన సత్ పాల్ కుమారుడు సంజీవ్ కు పాలి గ్రామానికి చెందిన శాలినితో 2014లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే.. 2018లో సంజీవ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో.. భార్య శాలిని పుట్టింటికి వచ్చేసింది.
ఈ క్రమంలో ఆమెకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. అతనితోనే ఉంటుంది. ఈ క్రమంలో.. భర్త ఆస్తి దక్కించుకోవాలని అనుకుంది. మామ నుంచి ఎలాగైనా ఆస్తి కొట్టేయాలని ప్లాన్ వేసింది.
ఈ విషయాన్ని తన ప్రియుడు విపిన్కు చెప్పింది. మామ సత్పాల్ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. సత్పాల్ను హతమార్చేందుకు ఓ కిరాయి ముఠాను సంప్రదించారు. వారితో ఒప్పందం కుదుర్చుకుని కొంత ముందస్తుగా డబ్బులు చెల్లించారు. సత్పాల్ హత్యకు రెక్కీ నిర్వహించి ముహూర్తం కూడా నిర్ణయించారు. అందులో భాగంగా జూన్ 29వ తేదీన పొలం నుంచి తిరిగివస్తున్న సత్పాల్ను ముఠా వెంబడించి తుపాకీతో కాల్చి అతి దారుణంగా హతమార్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా కోడలి ఉదంతం వెలుగులోకి వచ్చింది. సత్పాల్ హత్యకు శాలిని తండ్రి భోపాల్ సింగ్, సోదరుడు లలిత్ కూడా సహకరించారు. వీరితో పాటు ప్రియుడు విపిన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హంతక ముఠా ఆచూకీ మాత్రం లభించలేదు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీరట్ జిల్లాలో కలకలం సృష్టించిన ఈ ఘటనను పోలీసులు 20 రోజుల వ్యవధిలో చేధించడం విశేషం.