Asianet News TeluguAsianet News Telugu

నలుగురిని లవ్ చేసి.. లక్కీ డ్రాలో ఒకరిని సెలక్ట్ చేసుకొని..

నలుగురి పేర్లు చీటీ రాసి డ్రా తీయగా.. ఎవరి పేరు వస్తే వారితో యువతి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Woman Elopes With Four Men, UP Panchayat Holds Lucky Draw To Pick Husband After She Can't Decide Who To Choose
Author
Hyderabad, First Published Mar 6, 2021, 9:15 AM IST

ఓ యువతి ఒకేసారి నలుగురిని ప్రేమించింది. ఆ నలుగురితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. కాగా... యువతి కోసం కుటుంబసభ్యులు గాలించగా.. ఆచూకీ దొరికింది. ఆ నలుగురితో కలిసి యువతి ని పట్టుకొని ఇంటికి తీసుకువచ్చారు. కాగా.. తర్వాత.. ఆ నలుగురిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావని కుటుంబసభ్యులు ఆమెను ప్రశ్నించారు. దీంతో.. ఎవరిని ఎంచుకోవాలో యువతికి అర్థం కాలేదు.

దీంతో.. నలుగురి పేర్లు చీటీ రాసి డ్రా తీయగా.. ఎవరి పేరు వస్తే వారితో యువతి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అంబేడ్కర్ నగర్ లోని అజిమ్ నగర్ కు చెందిన యువతి ఇటీవల నలుగురు యువకులతో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. వీరంతా బంధువుల ఇల్లల్లో తలదాచుకున్నారు. ఈ విషయం తెలిసుకున్న యువతి కుటుంబస్యులు వారిని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు.

ఈ విషయంలో పంచాయతీ జోక్యం చేసుకొని కేసు పరిష్కరించడం గమనార్హం. నలుగురిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావనే ప్రశ్నకు యువతి బాగా తికమకపడిపోయింది. దీంతో పంచాయతీ పెద్దలు చిటీలు వేసి వరుడిని ఎంపిక చేశారు. నలుగురి పేర్లు రాసి ఓ చిన్నారితో డ్రా తీయించారు. చిన్నారి తీసిన చీటిలో పేరున్న యువకుడితో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios