Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరు: అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. మహిళ సజీవ దహనం, మంటల్లో చిక్కుకున్న మరికొందరు

కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. దేవరచిక్కనహళ్లిలోని అపార్ట్‌మెంట్‌లో మధ్యాహ్నం గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకై పై అంతస్తుల్లో భారీగా మంటలు వ్యాపించాయి

woman dead in a fire accident in bengaluru
Author
Bangalore, First Published Sep 21, 2021, 7:07 PM IST

కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. దేవరచిక్కనహళ్లిలోని అపార్ట్‌మెంట్‌లో మధ్యాహ్నం గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకై పై అంతస్తుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మహిళ సజీవదహనమైంది. మరికొందరు ఇతర ఫ్లాట్లలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడు ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios