ఓ భర్త భార్య మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టి ఇంట్లోనే పెట్టుకున్నాడు. జూన్ 30న ఆమె చనిపోగా.. జూన్ 2తేదీవరకు మృతి విషయం వెలుగుచూసింది.
మధ్యప్రదేశ్ : ఓ మహిళ అనుమానాస్పద మృతి మధ్యప్రదేశ్ లోని రీవాలో వెలుగు చూసింది. ఆమె మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టి ఉంచడానికి పోలీసులు గమనించి, స్వాధీనం చేసుకున్నారు. కనీసం కుటుంబసభ్యులకు విషయం తెలపకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఆమె 30 గంటలకు ముందే మరణించి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. కాగా ఆమె చనిపోవడంపై ఆమె సోదరుడు.. ఆమె భర్త మీద హత్యారోపణలు చేస్తున్నాడు. అయితే, ఆ భర్త మాత్రం.. తన కుమారుడు వచ్చేవరకు వేచి ఉంచాలని మృతదేహాన్ని ఫ్రీజర్ లో దాచి ఉంచానని చెబుతున్నాడు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇలా వివరాలు తెలిపారు.. మధ్యప్రదేశ్ లోని రీవా పరిధిలోని జివులా గ్రామానికి చెందిన సుమిత్ర మిశ్ర మృతి చెందిందని ఆమె సోదరుడికి జులై రెండవ తేదీన తెలిసింది. వెంటనే వారు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఆ సమాచారం మేరకు పోలీసులు సుమిత్ర మిశ్రా భర్త అయిన భరత్ మిశ్రా ఇంటికి చేరుకున్నారు. అప్పటికే భరత్ ఇంట్లో ఫ్రీజర్ లో అతని భార్య సుమిత్ర మిశ్రమ మృతదేహం ఉంది. ఆ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు.
కడప జిల్లాలో స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి..
సుమిత్ర సోదరుడు అభిరాజ్.. తన సోదరి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేశాడు. తన సోదరిని ఆమె భర్త భరత్ కొట్టి చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను భర్త చాలా కాలంగా వేధిస్తున్నాడని తెలిపాడు. ఇప్పుడు ఏకంగా హత్య చేశాడని.. మృతదేహాన్ని ఫ్రీజర్ లో ఉంచాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే.. మృతురాలి భర్త భరత్ మాత్రం దీన్ని ఖండిస్తున్నాడు. జూన్ 30వ తేదీన తన భార్య అనారోగ్యంతో మృతి చెందిందని అంటున్నాడు.
తన కుమారుడు ముంబైలో ఉంటున్నాడని… తల్లి చనిపోయిన వెంటనే ఆ విషయాన్ని అతనికి చెప్పానని.. కొడుకైన హర్ష వచ్చేవరకు దాచి ఉంచడం కోసం మృతదేహాన్ని ఫ్రీజర్ లో ఉంచానని చెబుతున్నాడు. దీనికోసం లయన్స్ క్లబ్ నుంచి ఫ్రీజర్ తెప్పించి.. మృతదేహాన్ని సురక్షితంగా ఉంచానని చెప్పుకొచ్చాడు. తన భార్య మృతికి పైల్స్ కారణమని.. చాలా కాలంగా ఈ వ్యాధితో బాధపడుతోందని తెలిపాడు.
పైల్స్ తగ్గడం కోసం మంత్రగాడిని ఆశ్రయించిందని కూడా చెప్పుకొచ్చాడు. ఆమె మృతికి అనారోగ్యమే కారణమని అన్నాడు… దీనిమీద పోలీసు అధికారి విజయ్ సింగ్ మాట్లాడుతూ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని ఆ రిపోర్టు వచ్చిన తర్వాతే మహిళ మృతికి గల కారణాలు తెలుస్తాయని తెలిపారు. దీనిమీద దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
