జడ్జీ భార్యాతనయులపై బాడీ గార్డ్ కాల్పులు (వీడియో)
కాల్పులు జరిపిన తర్వాత మహిపాల్ సదర్ పోలీసు స్టేషన్ కు చేరుకుని అక్కడ కూడా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పారిపోయాడు.
గుర్గావ్: ఓ న్యాయమూర్తి భార్యపై, కుమారుడిపై ఆయన బాడీ గార్డే కాల్పులు జరిపాడు. గురుగ్రామ్ లోని బిజీ మార్కెట్లో అతను శనివారం అందుకు తెగించాడు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.
న్యాయమూర్తి కుమారుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గురుగ్రామ్ లోని సెక్టార్ 49 ఆర్కాడియా మార్కెట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మహిపాల్ అనే గన్ మ్యాన్ ను న్యాయమూర్తి వద్ద ఏడాదిన్నర క్రితం పోస్టు చేశారు.
కాల్పులు జరిపిన తర్వాత మహిపాల్ సదర్ పోలీసు స్టేషన్ కు చేరుకుని అక్కడ కూడా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పారిపోయాడు. స్టేషన్ హౌస్ మాస్టర్ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆ తర్వాత అతన్ని పట్టుకున్నారు.
#WATCH: Wife and son of an additional sessions judge shot at by the judge's gunman in #Gurugram's Sector-49. Both the injured have been admitted to the hospital and the gunman has been arrested. pic.twitter.com/rMqXdYHrxR
— ANI (@ANI) October 13, 2018