Asianet News TeluguAsianet News Telugu

భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కలత.. అతని ఫ్రెండ్‌తో కలిసి భార్య ఏం చేసిందంటే?

భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి భార్య తట్టుకోలేకపోయింది. మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్న తన భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన భర్త మిత్రుడినే ఎంచుకుంది. తన భర్తను చంపితే.. రూ. 2 లక్షలు ఇస్తానని డీల్ కుదుర్చుకుంది. తన భర్తపై ఆయన అప్పటికే పగ పెంచుకుని ఉండటంతో మారుమాట్లాడకుండా హతమార్చాడు. ఆ తర్వాత పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

wife planned to kill husband for having extra marrital affairs
Author
Bhopal, First Published Jan 16, 2022, 4:20 AM IST

భోపాల్: భర్త(Husband) వివాహేతర సంబంధాలు(Extra Marrital Affair) పెట్టుకోవడం తెలిసి ఆ భార్య(Wife) తట్టుకోలేకపోయింది. నచ్చచెప్పి చూసినా లాభం లేకపోయింది. అలాగే.. జీవితాంతం భరిస్తూ ఎందుకు ఉండాలని ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. భర్త స్నేహితుడితో రహస్యంగా కలిసింది. తన భర్తను హతమార్చాల్సిందిగా ఆదేశించింది. అందుకు రూ. 2 లక్షలు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. అందులో ఒక లక్ష ముందుగానే ఇచ్చుకుంది. డీల్ కుదిరిన మరుసటి రోజే భర్త హత్య జరిగింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

జబల్‌పూర్ జిల్లా మఛ్లా గ్రామానికి చెందిన నరేశ్  యాదవ్, ఉష దంపతులు. నరేశ్ యాదవ్‌ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ అక్రమ సంబంధాల గురించి తెలుసుకున్న ఉష తట్టుకోలేకపోయింది. మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్న తన భర్తను హత్య చేయాలనే దుష్ట నిర్ణయం తీసుకుంది. దీనికోసం తన భర్త ఫ్రెండ్ అఖిలేష్‌తో డీల్ కుదుర్చుకుంది. నరేశ్ యాదవ్‌.. ఓ సారి అఖిలేష్ వదినపైనా అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. అప్పటి నుంచి నరేశ్ యాదవ్‌పై అఖిలేష్‌కు పీకల దాకా కోపం ఉన్నది. పగ తీర్చుకోవడానికి సరైనా సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. అలాంటి సమయంలో.. నరేశ్ యాదవ్ భార్యే స్వయంగా వచ్చి ఆయనను చంపాల్సిందిగా చెప్పడంతో అఖిలేష్ మారుమాట్లాడకుండా సరేనని అంగీకరించాడు.

ఈ నెల 11వ తేదీన ఉష పోలీసులను ఆశ్రయించి.. తన భర్త ఆచూకీ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. కాగా, మరుసటి రోజే నరేశ్ యాదవ్ డెడ్ బాడీ రెండు భాగాలుగా వేర్వేరు పొలాల్లో దొరికింది. పోలీసులు రంగంలోకి దిగి.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా.. నరేశ్ యాదవ్ చివరిసారి అఖిలేష్‌ను కలిసినట్టుగా గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. దీంతో అఖిలేష్‌ను ఆరా తీశారు. తనకేం సంబంధం లేదని ముందుగా బుకాయించాడు. కానీ, పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు.

పోలీసుల వివరాల ప్రకారం, నరేశ్ యాదవ్ విలాస పురుషుడు. అదే ఆయన ప్రాణం తీసింది. నరేశ్ యాదవ్ వివాహేతర సంబంధాలతో భార్య తట్టుకోలేక ఈ కుతంత్రం పన్నింది. ఉష నుంచి సుపారీ తీసుకున్న అఖిలేష్ జనవరి 10న రాత్రి నరేశ్ యాదవ్‌ను కలిశాడు. నరేశ్‌తో స్పృహ కోల్పోయేదాకా మందు తాగించాడు. ఆ తర్వాత అతని తల నరికేశాడు. అతని డెడ్ బాడీ ఎవరికీ దొరకవద్దని, రెండు భాగాలుగా చేసి వేర్వేరు పొలాల్లో దాచిపెట్టాడు. కానీ, పోలీసులకు శవ భాగాలు దొరికాయి. దీనితో కేసు దర్యాప్తు సులువైంది. ఈ కేసులో ఉషను కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

గుంటూరు(Guntur) జిల్లాలో ఇటీవలే ఓ దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి ఆ భార్య(Wife) ఏకంగా భర్త(Husband)ను హతమార్చింది. అంతేకాదు, ఆ హత్య చేసిన తర్వాత ఆ శవాన్ని(Dead Body) ఎవరికి కనిపించకూడదని ఓ కాల్వలో పడేశారు. కానీ, భర్త కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి జాడ గురించి దర్యాప్తు చేయగా ఆయన భార్య, ఆమె ప్రియుడు నేరానికి పాల్పడ్డట్టు అంగీకరించారు

Follow Us:
Download App:
  • android
  • ios