కేంద్ర మాజీమంత్రి భార్య హత్యలో షాకింగ్ నిజాలు.. ధోబీ రాజు స్కెచ్ వేసి.. !
కేంద్ర మాజీ మంత్రి, దివంగత పి. రంగరాజన్ కుమార మంగళం భార్య కిట్టి కుమార మంగళం హత్యకు గురయ్యారు. ఢిల్లీలోని వసంత్ విహార్ లో గల తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమెను చంపేశారు. కుమార మంగళం ఇంట్లో ధోబీగా పనిచేస్తున్న రాజు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
కేంద్ర మాజీ మంత్రి, దివంగత పి. రంగరాజన్ కుమార మంగళం భార్య కిట్టి కుమార మంగళం హత్యకు గురయ్యారు. ఢిల్లీలోని వసంత్ విహార్ లో గల తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమెను చంపేశారు. కుమార మంగళం ఇంట్లో ధోబీగా పనిచేస్తున్న రాజు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలు, మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో నిందితుడు రాజు కిట్టి కుమారమంగళం ఇంటికి చేరుకున్నాడు. కాలింగ్ బెల్ మోగడంతో పనిమనిషి తలుపు తీయగా, వెంటనే ఆమెపై మత్తుమందు చల్లి ఓ గదిలో పడేశాడు.
అదే సమయంలో, మరో ఇద్దరు యువకులు కిట్టీ కుమారమంగళం గదిలోకి వెళ్లి, ముఖం మీద దిండును అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ముగ్గురూ కలిసి అక్కడినుంచి పారిపోయారు. ఈ క్రమంలో స్పృహ కోల్పోయిన రెండు గంటల తరువాత మెలకువలోకి వచ్చిన పనిమనిషి పోలీసులకు ఫోన్ చేయగా.. వారు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కిట్టి కుమారమంగళం చనిపోయినట్లు గుర్తించారు.
కేంద్ర మాజీ మంత్రి భార్య దారుణ హత్య..!
పనిమనిషి చెప్పిన వివరాల ఆధారంగా.. ధోబి రాజును అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా.. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇక కిట్టీ కుమారమంగళంలోని విలువైన వస్తువులు, డబ్బు దొంగతనం చేసే క్రమంలో వారు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లోతుగా దర్యాప్తు చేపట్టారు. కాగా దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి హయాంలో (1998-2001) పి. రంగరాజన్ కుమారమంగళం కేంద్ర మంత్రిగా సేవలు అందించారు.