వివాహేతర సంబంధం: భర్తను చంపేందుకు ప్రియుడితో ప్లాన్, తుపాకితో కాల్చినా....
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు షాకింగ్ విషయాలను గుర్తించారు.
న్యూఢిల్లీ:వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు షాకింగ్ విషయాలను గుర్తించారు.
చిరాగ్ ఢిల్లీలో భీమ్ రాజ్ అనే వ్యక్తి భార్య భాటియాతో కలిసి నివసిస్తున్నాడు. భీమ్రాజ్ బీఎస్ఈఎస్లో పవర్ కాంట్రాక్ట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.అతడి భార్యకు 23 ఏళ్ల రోహన్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది.
ఈ విషయం తెలుసుకొన్న భీమ్ రాజ్ భార్యను పలుమార్లు మందలించాడు. అయినా ఆమె తీరులో ఏ మాత్రం మార్పురాలేదు. ప్రియుడి రోహన్ తో కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలని కోరింది. దీంతో వీరిద్దరూ కలిసి ప్లాన్ చేశారు.
రోహన్ ఓ దేశీయ తుపాకీని సమకూర్చుకొన్నాడు. బుధవారం నాాడు భీమ్ రాజు కారులో వెళ్తుండగా నెంబర్ మార్చిన బైక్ పై వెంబడించి కారుకు ఎదురుగా నిలబడి కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో భీమ్ రాజు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది.
టెక్నాలజీ సహాయంతో రోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఓ చిన్న ప్రమాదంలో తనకు భీమ్ రాజుకు మధ్య గొడవ జరిగిందని అందుకే ఆయనను చంపాలనుకొన్నట్టుగా రోహన్ చెప్పారు. అయితే ఈ విషయం నమ్మని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయాన్ని చెప్పాడు.
బీమ్ రాజు భార్యకు తనకు వివాహేతర సంబంధం ఉందన్నారు. ఆమె సలహా మేరకు భీమ్ రాజును హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్టుగా పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడు.