Asianet News TeluguAsianet News Telugu

బిడ్డను కనడానికి ఒప్పుకోవడం లేదని: భర్తను 11 సార్లు పొడిచి చంపింది

ముంబైలోని నలాసొపొరా ప్రాంతానికి చెందిన సునీల్, ప్రణాలీ కదమ్ భార్యాభర్తలు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ప్రణాలీకి కొడుకును కనాలని వుంది. ఈ విషయాన్ని భర్తకు చెప్పగా..అతను అందుకు అంగీకరించలేదు. ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారని.. మరో బిడ్డ అవసరం లేదని వారించాడు

wife kills husband in mumbai over he said no to third child
Author
Mumbai, First Published Aug 23, 2019, 1:25 PM IST

మరో బిడ్డను కనడానికి అంగీకరించడం లేదనే కోపంతో ఓ భార్య భర్తను అత్యంత కిరాతకంగా పొడిచి చంపింది

ముంబైలోని నలాసొపొరా ప్రాంతానికి చెందిన సునీల్, ప్రణాలీ కదమ్ భార్యాభర్తలు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ప్రణాలీకి కొడుకును కనాలని వుంది. ఈ విషయాన్ని భర్తకు చెప్పగా..అతను అందుకు అంగీకరించలేదు.

ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారని.. మరో బిడ్డ అవసరం లేదని వారించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రణాలీ బుధవారం తెల్లవారుజామున 5.30 ప్రాంతంలో కూరగాయలు కోసే కత్తితో భర్తను 11 సార్లు విచక్షణా రహితంగా పొడిచింది.

తీవ్ర రక్తస్రావం కావడంతో సునీల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రణాలీని అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల విచారణలో నిందితురాలు పొంతనలేని సమాధానం చెబుతున్నట్లుగా తెలుస్తోంది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే చంపానంటూ వాంగ్మూలం ఇచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios