Asianet News TeluguAsianet News Telugu

‘అత్తా నీ కొడుకును చంపేశా. శవం ఇంట్లో ఉంది’ .. పెళ్లైన ఆరునెలలకే కొత్తకోడలు ట్విస్ట్...

ఓ రోజు రాత్రి సడన్ గా కోడలు వచ్చి ఇంటి తలుపు కొట్టింది. ఏం జరిగిందా? అని ఆశ్చర్యంగా తలుపు తీస్తే.. కోడలి దగ్గరి నుంచి మద్యం ఘాటు వాసన వేస్తోంది. ఏంటిది? అని ప్రశ్నించగా ఆమె నవ్వుతూ.. ‘అత్తా నీ కొడుకును చంపేశా. అతని శవం ఇంట్లో ఉంది’ అని చెప్పింది. 

wife brutally kills husband, went to mother in laws home and says in rajasthan
Author
Hyderabad, First Published Aug 31, 2021, 11:33 AM IST

రాజస్థాన్ లో దారుణం జరిగిపోయింది. మద్యం మత్తులో కట్టుకున్న భర్తనే కడతేర్చిందో ఇల్లాలు. ఆ తరువాత అత్త దగ్గరికి వెళ్లి.. నీ కొడుకును చంపేశాను.. శవం ఇంట్లోనే ఉందంటూ చెప్పింది. అత్త నమ్మలేదు.. కానీ చివరికి అదే నిజం అని తేలడంతో షాక్ అయ్యింది. 

వివరాల్లోకి వెడితే.. గలాబ్ యాదవ్ (64) అనే మహిళ.. తన కొడుక్కి ఆరునెలల క్రితం పెళ్లి చేసింది. భార్యాభర్తలిద్దరూ వేరు కాపురం పెడతామంటే సరేనంది. ఇద్దరూ కలిసి తనకు దూరంగా ఉంటున్నా ఊరుకుంది. అయితే ఓ రోజు రాత్రి సడన్ గా కోడలు వచ్చి ఇంటి తలుపు కొట్టింది. ఏం జరిగిందా? అని ఆశ్చర్యంగా తలుపు తీస్తే.. కోడలి దగ్గరి నుంచి మద్యం ఘాటు వాసన వేస్తోంది. ఏంటిది? అని ప్రశ్నించగా ఆమె నవ్వుతూ.. ‘అత్తా నీ కొడుకును చంపేశా. అతని శవం ఇంట్లో ఉంది’ అని చెప్పింది. 

మద్యం మత్తులో కోడలు ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతుందనుకుందా అత్త. కానీ ఆమె నిజంగానే తన కొడుకును చంపేసిందని అస్సలు ఊహించలేదు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన రాజస్థాన్ లోని దుంగాపూర్ లో జరిగింది. ఇక్కడ స్థానికంగా నివసిచే గలాబ్ యాదవ్.. పోలీసులకు తన కోడలిమీద ఫిర్యాదు చేసింది. 

గలాబ్ యాదవ్ కుమారుడు నాథూ యాదవ్ కు ఆరు నెలల క్రితమే పెళ్లయ్యింది. భార్య కాంతాతో కలిసి ముంగేేడ్ గ్రామంలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఆగస్ట్ 23 న రాత్రి గలాబ్ యాదవ్ ఇంటికి వచ్చిన కాంత.. తాను ఇక ఇంటికి వెళ్లనని, అత్తతో పాటే ఉంటానని అన్నది. అయితే దీనికి ఆ అత్త ఒప్పుకోలేదు. కుమారుడి గురించి అడగ్గా.. భర్తను తాను చంపేశానని చెప్పింది. అయితే మద్యం మత్తులో పిచ్చి వాగుడు అనుకుంది.

అయితే నాథూ వాళ్ల  ఇంటి చుట్టుపక్కల వాళ్లు అతని ఇంటి నుంచి దుర్గంధం వస్తుండటంతో కిటికీల్లోంచి ఇంట్లోకి తొంగి చూశారు. వారికి చలనం లేకుండా పడి ఉన్న నాథూ యాదవ్ కనిపించాడు. దీంతో అప్రమత్తమైన వాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టి చూడగా నాథూ యాదవ్ మృతదేహం కనిపించింది. మరణించి నాలుగు రోజులు కావడంతో శవం నుంచి దుర్గంధం వస్తోంది. పురుగులు కూడా పట్టేశాయి. 

ఈ సమాాచారం అందుకున్న గలాబ్ యాదవ్.. కుమారుడి ఇంటికొచ్చి నిర్థాంతపోయింది. కోడలు చెప్పిన మాటలు పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేసింది. కాంత కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ  ఇంటి దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాలో ఆమె ఇంటికి తాళం వేసి వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios