బాబోయ్.. వాట్సప్ గ్రూపు నుంచి తీసేశాడని.. అడ్మిన్ నాలుక కోసేశారు..
వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశాడని ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా అడ్మిన్ ను చితకబాది.. అతడి నాలుక కోసేశాడు.
మహారాష్ట్ర : చిన్నచిన్న కారణాలకే దాడులకు పాల్పడడం.. దారుణం గా వ్యవహరించడం లాంటి సంఘటనలతో నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అలాంటి ఓ చిన్న సంఘటన కారణంగా ఓ వ్యక్తిని నాలుక కోసేసి, అతి దారుణంగా చితకబాదిన ఘటన మహారాష్ట్రలోని పూనేలో కలకలం రేపింది. డిసెంబరు 28న జరిగిన ఓ ఘటన కాస్త ఆలస్యంగా కొత్త సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ ఐదుగురు వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించాడని.. ఆ గ్రూపు అడ్మిన్ మీద విపరీతమైన కోపానికి వచ్చారు.
అతనితో వాగ్వాదం చేసి.. ఆగలేదు..అడ్మిన్ ను పట్టుకుని చితకబాదారు..అతని నాలుకని కోసేశారు. మహారాష్ట్రలోని పూణే లోని పుర్సుంగిలోని ఓ హౌజింగ్ సొసైటీలో డిసెంబర్ 28న ఈ ఘటన జరిగింది. బాధితుడైన గ్రూప్ అడ్మిన్ అక్కడే నివసిస్తున్నాడు. హౌజింగ్ సొసైటీ సమాచారం కోసం ‘ఓం హైట్స్ ఆపరేషన్’ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశాడు. ఆ సొసైటీలోని సభ్యులందరూ ఆ వాట్సాప్ గ్రూపులో ఉన్నారు.
భూమిలో పూడ్చిపెట్టుకుని రైతు వినూత్న నిరసన.. ‘ఆ పథకం కింద నాకు రావాల్సిన భూమి ఇవ్వాల్సిందే’ (వీడియో)
అయితే ఇటీవల ఎం జరిగిందో తెలియదు కానీ గ్రూప్ నుంచి ఓ వ్యక్తిని తొలగించాడు. దీనిపై వాట్సప్ గ్రూప్ నుంచి తనను ఎందుకు తొలగించారంటూ.. తీసేసిన వ్యక్తి అడ్మిన్ కు మెసేజ్ చేశాడు. అయితే అడ్మిన్ ఆ మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు. దీంతో నిందితుడికి తీవ్రమైన కోపం వచ్చింది. అడ్మిన్ కి కాల్ చేసి ఒకసారి కలవాలి అని చెప్పాడు. ఈ మేరకు మరో నలుగురు స్నేహితులలో తీసుకుని అతని దగ్గరికి వెళ్లాడు. అతనితో వాగ్వాదానికి దిగారు.
ఆ తర్వాత ఒక్కసారిగా నఐదుగురు కలిసి అతనిమీద దాడి చేశారు. అడ్మిన్ ను చిదకబాదారు. ఆ తర్వాత అతడి నాలుక కోసేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తగిన నాలుకను అతికించి కుట్లు వేశారు. ఈ విషయం తెలియడంతో హౌజింగ్ సొసైటీలో భయాందోళనలు నెలకొన్నాయి. అగ్ని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీస్ లు నిందితులపై కేసు నమోదు చేశారు.