లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ను కాపాడేందుకు ఎవరు ప్రయత్నించినా మాకు వ్యతిరేకమేనని వినేష్ ఫోగట్ అన్నారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియదు. అయితే అతడ్ని కాపాడేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారు. ఇది సరైనది కాదనీ, దేశంలోని మహిళలకు హాని చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి రెజ్లర్లు దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో దేశంలోని పలు ప్రాంతాలను పర్యటింస్తున్నారు. బజ్రంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ హర్యానా, పంజాబ్లో పర్యటిస్తున్నారు.
ఈ నెల 28న మహిళా మహాపంచాయత్ ఏర్పాటు చేయనున్నామనీ, ఆ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే.. రెజ్లర్ బజ్రంగ్ హర్యానాలోని జింద్కు చేరుకోగా, సాక్షి మాలిక్ ఆమె భర్త సత్యవర్త్ కడియాన్ పంజాబ్లో పర్యటిస్తున్నారు. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ముందు భారీ ఎత్తున ధర్నా చేసేందుకు అన్ని గ్రామాల నుంచి ప్రజలు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సంగీతా ఫోగట్, వినేష్ ఫోగట్ లు జంతర్ మంతర్ వద్ద దీక్ష కొనసాగిస్తున్నది.
ఈ సందర్భంగా వినేష్ ఫోగట్ మీడియాతో మాట్లాడుతూ.. ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 28న జరగనున్న పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్ హాజరైతే.. దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై స్పష్టమైన సందేశం పంపిస్తామన్నారు. ఖాప్ లీడర్లతో సమావేశం కోసం తమ సహచరులు నార్త్ ఇండియాలో పర్యటిస్తున్నారని తెలిపారు. బ్రిజ్ భూషణ్ను అరెస్ట్ చేయాలన్న ఏకైక లక్ష్యంతో మహాపంచాయత్ను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.
బ్రిజ్ భూషణ్ను కాపాడేందుకు ఎవరు ప్రయత్నించినా తమకు వ్యతిరేకమేననీ, ప్రభుత్వంలో అంతర్గతంగా ఏం జరుగుతుందో తమ తెలియదు. కానీ, ఎవరో ఆయనకు రక్షణ కల్పించాలని చూస్తున్నారని, ఇది సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశ మహిళలకు హాని చేస్తున్నారన్నారు. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్ ను అనుమతిస్తే.. తమ ఆందోళన మరింత విస్త్రుతమవుతాయని తెలిపారు.
తమ డిమాండ్ల కోసం ఆదివారం కొత్త పార్లమెంట్ హౌస్ ఎదుట మహిళా మహాపంచాయత్ నిర్వహించాలని నిర్ణయించామనీ, ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ఉంటే ఏం సందేశం వెళ్తుందని వినేశ్ను ప్రశ్నించగా.. మే 28న కొత్త పార్లమెంట్లో బ్రిజ్ భూషణ్ హాజరైతే దేశమంతా ఆటోమేటిక్గా మెసేజ్వెళ్తుందని తెలిపారు.
వినేష్ , ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునియా,సాక్షి మాలిక్లతో సహా దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు ఏప్రిల్ 23 నుండి జంతర్ మంతర్ వద్ద సమ్మె చేస్తున్నారు. మైనర్తో సహా ఏడుగురు మహిళా క్రీడాకారిణులను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించాడని ఆరోపించాడు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.